Breaking News Live: జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 31న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ABP Desam Last Updated: 31 Oct 2021 08:46 PM
Background
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ఆదివారం తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రాజ్కుమార్, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్లో...More
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ఆదివారం తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పునీత్ అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు రాజ్కుమార్, పార్వతమ్మ సమాధుల వద్దే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు చేస్తున్నారు. అంత్యక్రియల్లో సీఎం బసవకుమార్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, పలువురు కన్నడ సినీ నటులు పాల్గొన్నారు. పునీత్ సోదరుడైన రాఘవేంద్ర కుమారుడు వినయ్తో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.రెండ్రోజుల నుంచి ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం..బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ పార్థీవ శరీరాన్ని చూసి అభిమానులు, ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, ఆలీతోపాటు ప్రభుదేవా తదితరులు పునీత్కు నివాళులు అర్పించారు.పునీత్కు నివాళులు అర్పించిన తర్వాత హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘పునీత్ లేడంటే నమ్మలేకపోతున్నాం. కన్నడంలో ‘జేమ్స్’ సినిమా కోసం 40 రోజులు ఆయనతో కలిసి పనిచేశాను. ఈ సినిమా కంటే ముందు నుంచే పునీత్ తెలుసు. ఆయన అన్న శివ రాజ్కుమార్, ఆయన కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. ‘జేమ్స్’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అందులో నాది ప్రతినాయకుడి పాత్ర. నాకు బాడీగార్డుగా పునీత్ నటిస్తున్నాడు. ఇంకా ఒక ఫైట్ సీన్, పాట, డబ్బింగ్ మిగిలి ఉంది. డబ్బింగ్ శివ రాజ్కుమార్ చెప్పవచ్చేమో. వారం కిందటే పునీత్ నాతో మాట్లాడాడు. కన్నడ డబ్బింగ్ కూడా నేనే చెప్పాలని కోరాడు’’ అని శ్రీకాంత్ తెలిపారు.పలువురు అభిమానులకు గుండెపోటుకన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణంతో అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే బాధను తట్టుకోలేక ఒక అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గడివద్దిరా అనే యువకుడు తన ఇంట్లో పునీత్ ఫొటోకు నివాళి అర్పించిన అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.పునీత్ మరణంతో ఫ్యాన్స్ కొందరు గుండెపోటుతో మృతి చెందారు. పునీత్ రాజ్కుమార్ మరణానంతరం చాంరాజ్ నగర్ జిల్లాకు చెందిన మునియప్ప అనే 30 సంవత్సరాల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు.బెళగావి ప్రాంతానికి చెందిన పరశురామ్ దేమణ్ణనవర్ అనే యువకుడు కూడా గుండెపోటుతో మృతి చెందాడు. పునీత్ మరణవార్త విన్నప్పటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు.ఉడుపి జిల్లాకు చెందిన సతీష్(35) అనే ఆటో డ్రైవర్ బాధలో ఆటోని గట్టిగా కొట్టాడు. దీంతో చేతికి పెద్ద గాయం అయి.. రక్తం కారడం మొదలైంది. ఇతను ఇప్పుడు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. పునీత్ రాజ్కుమార్ను తన ఫ్యాన్స్ ప్రేమగా అప్పు అని పిలుస్తారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దంతేవాడలో ఎన్ కౌంటర్... ముగ్గురు మావోలు మృతి
చత్తీస్ ఘడ్ దంతేవాడలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.