Somireddy Chandramohan Reddy counters to CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేస్తూ.. కీలక విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తన సోదరి షర్మిలపైనే పరోక్ష విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ గా మారారని విమర్శలు చేశారు. ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో కొంత మంది ఉన్నారని..పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు.


అదే ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న మీ బిడ్డ అయిన తనకు స్టార్ క్యాంపెనర్లు లేరని జగన్ వ్యాఖ్యానించారు. మీ బిడ్డకు ఉన్న స్టార్ క్యాంపెనర్లు మీరే అంటూ జగన్ వ్యాఖ్యానించారు. 


జగన్ చెప్పింది కరెక్టే


దీనిపై తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ నేడు చెప్పింది వందకు వంద శాతం కరెక్టే అని అన్నారు. జగన్ కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని అన్నారు. జగన్ ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ అని.. ధగా పడ్డ ప్రతి రైతు ఒక స్టార్ క్యాంపెయినర్ అని అన్నారు. ప్రభుత్వ బాదుడుతో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్ అని... అణిచివేతకు గురైన ప్రతి బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డ కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఎక్స్ లో సోమిరెడ్డి ఒక పోస్టు చేశారు. 


‘‘ఈ రోజు జగన్ చెప్పింది 100 శాతం నిజం. 2024 ఎన్నికలకు జనమే స్టార్ క్యాంపెయినర్లు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఎన్నికల యుద్ధంలో సామాన్య ప్రజలే స్టార్ క్యాపెంయినర్లు. జగన్ ను నమ్మి మోసపోయిన ప్రతి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్. ధగా పడ్డ ప్రతి అన్నదాత ఒక స్టార్ క్యాంపెయినర్. ప్రభుత్వ బాదుడుతో బలైన ప్రతి పేదవాడు ఒక స్టార్ క్యాంపెయినర్. అణిచివేతకు గురైన ప్రతి బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుడు కూడా వైసీపీని కూల్చే స్టార్ క్యాంపెయినర్లు’’ అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.