Republic Day 2022 Live Updates: పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 26 Jan 2022 03:25 PM
Background
మరికొద్దిసేపట్లో దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్కు అంతా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. రాజ్ పథ్లో కవాతుపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు, కవాతు మొత్తం...More
మరికొద్దిసేపట్లో దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్కు అంతా పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. రాజ్ పథ్లో కవాతుపై ఉగ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో, విజయ్ చౌక్ నుండి ఎర్రకోట వరకు, కవాతు మొత్తం మార్గాన్ని కంటోన్మెంట్గా మార్చారు. 71 మంది డీసీపీలు, 213 మంది ఏసీపీలు, 753 మంది ఇన్స్పెక్టర్లు ఆఫ్ ఢిల్లీ పోలీస్లకు పరేడ్ భద్రతను అప్పగించారు. పరేడ్ భద్రత కోసం 27 వేల 723 మంది జవాన్లు, కమాండోలు, ఢిల్లీ పోలీసుల షార్ప్ షూటర్లను మోహరించారు.Also Read: కన్నార్పకుండా చూసేలా గణతంత్ర వేడుకలు.. ఈ సారి ఎన్నెన్ని విశేషాలో తెలుసా..?ఈ జవాన్లకు సహాయం చేయడానికి, 65 కంపెనీ పర్మిట్రీ ఫోర్స్ను కూడా మోహరించారు. ఉగ్రవాదులు, దుండగులను అదుపు చేసేందుకు 200 విధ్వంస నిరోధక బృందాలను మోహరించారు. ఎలాంటి ముప్పు కలగకుండా భద్రత కోసం ఎన్ఎస్జి ప్రత్యేక బృందాలను కూడా పరేడ్ వేదిక చుట్టూ మోహరించారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భూమి నుంచి ఆకాశం వరకు పర్యవేక్షణ జరుగుతోంది.Also Read: Republic Day Award 2022: బిపిన్ రావత్కు పద్మవిభూషణ్.. కోవాగ్జిన్ సృష్టికర్తలకు పద్మభూషణ్.. అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం !దాదాపు 2,700 మంది బలగాలను మోహరించారు. పోలీసులు ఉగ్రవాదుల పోస్టర్లను అతికించారు. యాంటీడ్రోన్ వ్యవస్థలు కూడా అమర్చారు. ఉగ్రవాదుల ముప్పు దృష్ట్యా ఢిల్లీని ఆనుకుని ఉన్న పొరుగు రాష్ట్రాల ఏజెన్సీలను కూడా అప్రమత్తం చేశారు. ఢిల్లీ పోలీసులు కూడా నిఘా సంస్థలతో నిరంతరం టచ్లో ఉన్నారు. అంతే కాదు హోటళ్లు, లాంజ్లు, ధర్మశాలల్లో నివసించే వారి వెరిఫికేషన్ కూడా జరిగింది.దీనితో పాటు, ఢిల్లీలో కొత్తగా అద్దెకు దిగిన వారిపై కూడా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. ఢిల్లీలోని ఘాజీపూర్ మండిలో పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో భద్రతా సంస్థలు భద్రత విషయంలో గతంలో కంటే మరింత అప్రమత్తమయ్యాయి.Also Read: Gold-Silver Price: రిపబ్లిక్ డే నాడు ఎగబాకిన బంగారం.. వెండి నేల చూపులు, నేటి ధరలు ఇవే..Also Read: బిపిన్ రావత్కు పద్మవిభూషణ్.. కోవాగ్జిన్ సృష్టికర్తలకు పద్మభూషణ్.. అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం !Also Read: Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీAlso Read: Darshanam Mogilaiah: ఒక్క పాటతో విపరీత క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తికి పద్మశ్రీఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకం రెపరెపలు
భారత ఆర్మీ జవాన్లు పూంఛ్ లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రిపబ్లిక్ వేడుకల్లో భాగస్వాములు అయ్యారు.