Breaking News: జాబ్ నోటిఫికేషన్లపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్

Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 24 Apr 2022 11:48 AM
Job Notificationsపై సీఎం కేసీఆర్‌కు ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసి 45 రోజులు అవుతున్నా, ఇంతవరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ కాకపోవడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాకుండా ఎన్ని ఏళ్ళు ఆపగలరు, మీ కొడుకులాగే తెలంగాణ బిడ్డలను మీరు భావించాలి కదా.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ ట్వీట్ చేశారు.

Peddapalli Road Accident: డీసిఎం వ్యాన్, కారు ఢీ - ఇద్దరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు

Peddapalli Road Accident: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద డీసిఎం వ్యాన్, కారు ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Tractor Overturned In Eluru: ఏలూరులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా - నలుగురికి తీవ్ర గాయాలు

Tractor Overturned In Eluru: ఏలూరులో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా - నలుగురికి తీవ్ర గాయాలు


ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులో ఆదివారం తెల్లవారుజామున అదుపుతప్పి ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని స్థానికులు చింతపూడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చింతలపూడి మండలం బాలావారిగూడెం నుంచి పుట్రేపు మారెమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ట్రాక్టర్ లో సుమారుగా 20 మంది వరకు ఉన్నారు.

Tirumala Updates: శ్రీవారి సేవలో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ దుర్గప్రసాద్, తదితర ప్రముఖులు

Tirumala Updates: తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ దుర్గప్రసాద్, గుంటూరు ఎమ్మెల్యే మద్దలి గిరి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సౌత్ జోన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్ పుష్ప సత్యనారాయణలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Prashant Kishor Meets KCR: నేడు మరోసారి కేసీఆర్‌తో భేటీ కానున్న ప్రశాంత్ కిషోర్

Prashant Kishor Meets KCR: ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మరోసారి భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్‌కు విజయాన్ని అందించేంటుకు ఆయన టీమ్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తన బృందంతో  సర్వే నిర్వహించారు. ఇప్పటివరకూ 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ కొన్ని రోజుల కిందట భేటీ సందర్భంగా అందించారు. మిగతా నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించి, సర్వే వివరాలపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయాలు గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనిచేయదని చెప్పకనే చెప్పారు.

Background

ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నిన్న చాలా గంటలల పాటు సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాత్రి ప్రగతి భవన్‌లోనే ప్రశాంత్ కిషోర్ బస చేశారని, నేడు సైతం మరిన్ని అంశాలపై చర్చించనున్నారని సమాచారం.


పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్  ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, బస్సులోని 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాచేపల్లి పట్టణం అద్దంకి నార్కెట్‌పల్లి హైవేపై శనివారం రాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. 


డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా ?
జగన్ ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో నిద్రమత్తులో ఉన్న  డ్రైవర్ ట్రావెల్స్ బస్సును దామరచర్ల సమీపంలో హై స్పీడ్ లో నడుపుతూ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌టెక్ చేయబోయాడు. పరిస్థితి గమనించిన ప్రయాణికులు జాగ్రత్తగా నడపాలని డ్రైవర్ ను వారించారు. 


గత రెండు వారాలుగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 24th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా  పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 24th April 2022) లీటర్ ధర రూ.121.19 కాగా, ఇక్కడ డీజిల్ లీటర్ ధర రూ.106.80 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 83 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.


ఉపరితల ఆవర్తనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో కేవలం ఉత్తర కోస్తాంధ్రను మినహాయిస్తే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎండలు మండిపోతాయి. తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్ష సూచన ఉండగా.. మిగతా ప్రాంతాల్లో భానుడి ప్రతాపానికి ప్రజలు తట్టుకోలేరు అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వేసవికాలంలో నమోదయ్యే వర్షాలు కనుక, పిడుగు పాటు అవకాశాలు ఉన్నాయని  ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నట్లు తెలిపారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.