One person survives Ahmedabad plane crash :  అహ్మదాబాద్ విమాన ప్రమాద పరిస్థితుల్ని చూసిన ఎవరైనా ఒక్కరంటే ఒక్కరైనా బతికి ఉంటారని అనుకోలేరు. అంత భయానకంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. చనిపోయిన వారి శరీరాలను కూడా గుర్తించలేరు. అయితే ఒక్క వ్యక్తి మాత్రంచిన్న గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అతని పేరు  రమేష్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడా.  

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171లో ప్రయాణీకులలో ఒకరైన రమేష్ విశ్వాస్‌కుమార్ బుచర్వాడా, ఘోర విమాన ప్రమాదం నుండి  ఎవరూ ఊహించని విధంగా ప్రాణాలతో బయటపడ్డారు. 38 ఏళ్ల రమేష్, సీటు నంబర్ 11Aలో కూర్చున్నవారు, ప్రమాద సమయంలో విమానం నుండి దూకినట్లు తెలుస్తోంది. రమేష్ విశ్వాస్ కుమార్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది..

అహ్మదాబాద్ పోలీసు కమిషనర్ జీఎస్ మాలిక్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణీకుడు బయటపడ్డాడని వార్తా సంస్థ ఏఎన్ఐకి తెలిపారు. "పోలీసులు సీటు నంబర్ 11Aలో ఒక బయటపడిన వ్యక్తిని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరణాల సంఖ్య గురించి ఇంకా ఏమీ చెప్పలేము. విమానం జనావాస ప్రాంతంలో కూలినందున మరణాల సంఖ్య పెరగవచ్చు," అని మాలిక్ తెలిపారు.

లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ చేసిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది, రాడార్ డేటా ప్రకారం విమానం కేవలం 625 అడుగుల ఎత్తు మాత్రమే చేరుకుని  కూలిపోయింది.  విమానం బీజే మెడికల్ కాలేజీ , హాస్పిటల్ యొక్క  భవనాన్ని ఢీకొట్టింది.

230 మంది ప్రయాణీకులు మరియు 12 మంది సిబ్బంది సభ్యులతో కూడిన ఈ విమానం, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి మధ్యాహ్నం 1:39 గంటలకు బయలుదేరి, ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధం కోల్పోయింది.