NHAI Explains Rules For Highway Illumination: జాతీయ రహదారులపై (National Highways) ప్రయాణించే వాహనదారులు చాలా కాలంగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు. హైవేల పొడవునా స్ట్రీట్ లైట్లు ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సోషల్ మీడియా వేదికగా ఒక అఫీషియల్ క్లారిటీ ఇచ్చింది. రోడ్ల పొడవునా నిరంతరాయంగా లైట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కేవలం ఒక అపోహ మాత్రమేనని, ఇది మన దేశ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) నిర్దేశించిన సేఫ్టీ గైడ్లైన్స్ ప్రకారమే అవసరమైన చోట మాత్రమే లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
లైట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు..ఎన్హెచ్ఏఐ గైడ్లైన్స్ ప్రకారం, కేవలం యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉండే జోన్లలో మాత్రమే హై-క్వాలిటీ లైట్లను ఇన్స్టాల్ చేస్తారు. టోల్ ప్లాజాలు, ఇంటర్చేంజ్లు, రోడ్ జంక్షన్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, జనాభా ఉండే పట్టణ ప్రాంతాలు లేదా సెమీ-అర్బన్ ఏరియాలు ,బస్ బేలు, ట్రక్ లే-బైలు , ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రమాదకరమైన మలుపులు.. ఈ లొకేషన్లలో పెడెస్ట్రియన్ మూవ్మెంట్, క్లిష్టమైన రోడ్డు డిజైన్ ఉండటం వల్ల డ్రైవర్లకు స్పష్టమైన విజన్ ఇవ్వడం కోసం లైట్లు పెట్టడం తప్పనిసరి.
హైవేల పొడవునా లైట్లు ఎందుకు పెట్టరు..?వేల కిలోమీటర్ల పొడవు ఉండే నేషనల్ హైవేల నెట్వర్క్ అంతటా లైట్లు అమర్చడం అనేది ఎకనామికల్గా చాలా నష్టాన్ని కలిగిస్తుంది. దీనివల్ల పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ప్రభుత్వానికి పెద్ద భారం అవుతుంది. పర్యావరణ పరంగా చూసినా ఇది కరెక్ట్ కాదు. ఈ ఎనర్జీ వేస్ట్ను అరికట్టడానికే ఎన్హెచ్ఏఐ ఈ డెసిషన్ తీసుకుంది. పైగా ఆధునిక హైవేలను డిజైన్ చేసేటప్పుడు లైట్లు లేని చోట్ల కూడా నైట్ డ్రైవింగ్ ఈజీగా సాగేలా స్పెషల్ ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు.
నైట్ డ్రైవింగ్ కోసం అడ్వాన్స్డ్ ఫీచర్స్రోడ్లపై వెలుతురు లేకపోయినా డ్రైవర్లు దారి తప్పకుండా ఉండటానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. రోడ్ల మధ్యలో, పక్కన రేడియం రిఫ్లెక్టివ్ సైన్బోర్డులు, రోడ్డు మార్కింగ్స్, బ్లింకర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల హెడ్లైట్ల వెలుతురు పడగానే స్పష్టంగా మెరుస్తాయి. దీనివల్ల చీకటిలో కూడా సేఫ్గా డ్రైవ్ చేయవచ్చు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, హైవే ప్లానింగ్ సిస్టమ్పై అవగాహన పెంచడానికే ఈ వివరణ ఇచ్చినట్లు అధికారులు చెప్పారు.
