రామాంతపూర్ ఘటనతో ఇంటర్బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 19 Aug 2022 06:51 PM
Background
ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది....More
ఈశాన్య, పరిసర ప్రాంతాలైన తూర్పు బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం వాయువ్యవ దిశగా కదులుతూ తీవ్ర అల్పపడీనంగా నేడు బలపడనుంది. అనంతరం ఉత్తర బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ వైపు ప్రయాణిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయిని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో నేడు, రేపు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ రోజు పెరిగిన బంగారం ధరలు గత రెండు రోజులు క్రమంగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 అయింది. హైదరాబాద్లో రూ.900 తగ్గడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.62,400గా ఉంది. కరీంనగర్, వరంగల్లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,250 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,900 గా ఉంది. వెండి కేజీ ధర రూ.62,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం 18-08-2022 రోజున 70,674 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 35,930 మంది తలనీలాలు సమర్పించగా, 4.53 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో స్వామి వారి సర్వ దర్శనంకు 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీవేంకటేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కలియుగ దైవం శ్రీనివాసుడి తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమోగుతోంది.ఢిల్లీలో పరిస్థితి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రంలోని బీజేపీ అనేలా కనిపిస్తోంది. ఇటీవల ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లే జరుగుతోంది. ఇటీవల ఓ మంత్రిని అరెస్ట్ చేశారు. మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ అభియోగాలు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఇటీవల కేజ్రీవాల్ ఆరోపించారు. తాజాగా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. నేటి ఉదయం సీబీఐ అధికారులు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కొందరు సీబీఐ అధికారులు ఆప్ నేత సిసోడియా ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. మా ఇంటికి సీబీఐ వచ్చింది..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రామాంతపూర్ ఘటనతో ఇంటర్బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని రామాంతపూర్లో జరిగిన ఘటనతో అలర్ట్ అయిన ఇంటర్బోర్డు కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. ఏవో కారణాలు చెప్పి టీసీలు ఇవ్వకుండా ఆపొద్దని ఆదేశించింది. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్దేనని హెచ్చరించింది. ఇంటర్ అధికారులు రాష్ట్రంలోని కాలేజీలను సందర్శిస్తారని... ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం చర్యలు తప్పవని చెప్పింది.