Modi US Visit LIVE: ముగిసిన క్వాడ్ సదస్సు.. న్యూయార్క్కు మోదీ పయనం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నేడు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు.
ABP Desam Last Updated: 25 Sep 2021 03:52 AM
Background
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు బైడెన్తో భేటీ కానున్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్...More
ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు బైడెన్తో భేటీ కానున్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు. వాణిజ్యం,పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరుకానున్నారు.8.30 PM (IST): ప్రధాని నరేంద్ర మోదీ- బైడెన్ మధ్య దాదాపు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 11.30 PM IST (Sept 24) to 3.30 AM (Sept 25): ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు ఈ సమావేశం జరగనుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
న్యూయార్క్కు పయనం..
క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనం కానున్నారు. ఐరాస 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.