Modi US Visit LIVE: ముగిసిన క్వాడ్ సదస్సు.. న్యూయార్క్‌కు మోదీ పయనం

Advertisement

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్- ప్రధాని నరేంద్ర మోదీ మధ్య నేడు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొంటారు.

ABP Desam Last Updated: 25 Sep 2021 03:52 AM
న్యూయార్క్‌కు పయనం..

క్వాడ్ సదస్సు ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. న్యూయార్క్ పయనం కానున్నారు. ఐరాస 76వ జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు మోదీ వెళ్లనున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.





Continues below advertisement
శాంతి స్థాపనకు..

శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన 'క్వాడ్'​ దేశాధినేతల సదస్సు ముగిసింది. ఇండో పసిఫిక్ ప్రాంతం సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనకు ఐకమత్యంగా కృషిచేయాలని క్వాడ్ కూటమి నిర్ణయించింది. వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ ప్రాంత అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా చర్చించింది.

Background

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే..


అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అధ్యక్షుడు బైడెన్‌తో భేటీ కానున్నారు. తీవ్రవాదం, సీమాంతర ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిణామాలపై ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా పేర్కొన్నారు.  


వాణిజ్యం,పెట్టుబడి సంబంధాల బలోపేతం, రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరుదేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు శ్వేతసౌధ అధికారులు ప్రకటించారు. ఈ భేటీకి మోదీతోపాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ హాజరుకానున్నారు.


8.30 PM (IST): ప్రధాని నరేంద్ర మోదీ- బైడెన్ మధ్య దాదాపు గంటపాటు ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. 


11.30 PM IST (Sept 24) to 3.30 AM (Sept 25): ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి 'క్వాడ్' దేశాధినేతల మధ్య శ్వేతసౌధంలో దాదాపు 4 గంటలపాటు ఈ సమావేశం జరగనుంది.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.