Hyderabad: హైదరాబాద్ లోని సురారం ప్రాంతంలో ఓ వివాహితుడు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అతను ఉరి వేసుకొనే ముందు ఓ హిజ్రాకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నట్లుగా చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


పల్నాడు జిల్లా పిడుగు రాళ్ల మండలం కాసర్లపాడు గ్రామానికి చెందిన బానోత్ నాగదుర్గ నాయక్ (22) సూరారం మల్లారెడ్డి హాస్పిటల్లో వార్డు బాయ్ గా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం అతడికి వివాహం అయింది. భార్యతో కలిసి సూరారం దయానంద్ నగర్ లో ఉంటున్నారు. నాలుగేళ్ల క్రితం ముత్తయ్య నగర్ కు చెందిన ఓ హిజ్రాతో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి ఈ నెల 27న భార్య నిలదీసింది. అనంతరం డ్యూటికీ వెళ్తున్నానని చెప్పి, ఆమెను స్వగ్రామానికి వెళ్లిపోమ్మన్నాడు. నేరుగా హిజ్రా ఇంటికి వెళ్ళాడు. హిజ్రాను బాలానగర్ కు పంపించి ఇంట్లో ఉండిపోయాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో వీడియో కాల్ చేసి ఉరేసుకుని చనిపోతున్నానని చెప్పాడు. ఆమె తిరిగివచ్చే లోగా ఉరి వేసుకుని కనిపించాడు. 


దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. భార్య, స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరించారు. ఆ హిజ్రాను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.