Delhi MCD Election 2022: 'దిల్లీని క్లీన్ చేసేందుకు ఇదో మంచి అవకాశం- వారికి ఓటెయ్యొద్దు'

Delhi MCD Election 2022: అవినీతిపరులకు ఓటు వేయొద్దని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Continues below advertisement

Delhi MCD Election 2022: దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అవినీతికి పాల్పడే వారికి ఓటు వేయవద్దని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో కేజ్రీవాల్ మాట్లాడారు. దిల్లీని క్లీన్ చేయడానికి ఈ ఎన్నికలు ఒక అవకాశమన్నారు.

Continues below advertisement

ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ చూసినా చెత్తా చెదారం ఉంది. దిల్లీని శుభ్రం చేయడానికి ఇది ఒక అవకాశం. అభివృద్ధి పనులు చేసే పార్టీకి ఓటు వేయండి. దిల్లీ పనిని ఆపే పార్టీకి ఓటు వేయకండి. నిజాయితీ గల పార్టీ కోసం.. ఓటు వేయండి. అవినీతిపరులకు ఓటు వేయకండి. మంచి వ్యక్తులకు ఓటు వేయండి. గుండాయిజం, అవినీతి, దూషణలు చేసే వారికి కాదు. వచ్చే ఐదేళ్లలో దిల్లీని శుభ్రం చేయాలి.                                          -    అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ సీఎం

మొత్తం 250 వార్డులకు పోలింగ్‌ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 1,349 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పోల్స్‌లో 1.45 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటర్లు ఉన్నారు. భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు సాగుతోంది. దిల్లీలో ఆప్, భాజపా హోరాహోరీ ప్రచారం చేశాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది.

భాజపా ఆగ్రహం

మరోవైపు ఓటింగ్ ప్రక్రియపై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని వార్డుల్లో భాజపా మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించింది.

సుభాష్ మొహల్లా వార్డులో భాజపాకు మద్దతిచ్చిన 450 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇది దిల్లీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్ర. దీనిపై ఫిర్యాదు చేస్తాం. ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు విజ్ఞప్తి చేస్తాం.                                       - మనోజ్ తివారీ, భాజపా ఎంపీ

Also Read: Viral Video: వైరల్ వెడ్డింగ్- పెళ్లికి వచ్చే వారి కోసం ఏకంగా విమానం బుక్ చేశారు!

Continues below advertisement
Sponsored Links by Taboola