LTTE Leader Alive:



ఎల్‌టీటీఈ చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ సంచలన విషయం చెప్పారు  తమిళ్ నేషనలిస్ట్ లీడర్ పర నెడుమారన్. ప్రభాకరన్ అనుమతితోనే ఈ విషయం వెల్లడిస్తున్నట్టు ప్రకటించారు. 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. కానీ..ఉన్నట్టుండి ఆయన బతికే ఉన్నారంటూ వార్తలు రావడం సంచలనమవుతోంది. అంతే కాదు. ఆయన ఇప్పటికీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారనీ చెప్పారు నెడుమారన్. 2009లోనే ఆయనను మట్టుబెట్టినట్టు శ్రీలంక అప్పట్లోనే స్పష్టం చేసింది. డెడ్‌బాడీ ఫోటోలనూ బయట పెట్టింది. ఇప్పుడు నెడుమారన్ "ప్రభాకరన్ బతికే ఉన్నారు" అని చెప్పడం అలజడి సృష్టిస్తోంది. అంతే కాదు. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారనీ చెప్పారు.