PM Modi Breaking News LIVE: జపాన్ ప్రధానితో మోదీ భేటీ.. ఆ దేశం భారత్కు విలువైన భాగస్వామి: మోదీ
PM Modi News LIVE: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎప్పటికప్పుడు జరుగుతున్న అప్డేట్స్ ఈ లైవ్ బ్లాగ్లో చూడొచ్చు. తాజా అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేయండి.
ABP Desam Last Updated: 24 Sep 2021 07:48 AM
Background
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ సంస్థల సీఈఓలతో తొలుత భేటీ కానున్నారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో సమావేశం కానున్నారు.వాషింగ్టన్ డీసీ లో జరగబోయే ఈ భేటీకి క్వాల్కమ్, ఎబోడ్, ఫస్ట్ సోలార్, జనరల్...More
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రముఖ సంస్థల సీఈఓలతో తొలుత భేటీ కానున్నారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో సమావేశం కానున్నారు.వాషింగ్టన్ డీసీ లో జరగబోయే ఈ భేటీకి క్వాల్కమ్, ఎబోడ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటామిక్స్, బ్లేక్స్టోన్కు సంస్థల సీఈఓలతో సమావేశమవుతారు. 11 PM (IST) - ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్తో మోదీ భేటీ అవుతారు. 12.45 AM (IST) - అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 3 AM (IST) - జపాన్ ప్రధాని యోషిహిదే సుగాతో ప్రధాని మోదీ చర్చలు
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జపాన్ ప్రధానితో మోదీ భేటీ
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గురువారం (స్థానిక కాలమానం) జపాన్ ప్రధాని యోషిహిడే సుగాను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జపాన్ భారత్కు అత్యంత విలువైన భాగస్వామి అని కొనియాడారు. జపాన్ ప్రధానితో భేటీ బాగా జరిగిందని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా తాము వివిధ అంశాలపై చర్చించామని మోదీ తెలిపారు.