Karnataka Minister: మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!

ABP Desam   |  Murali Krishna   |  19 Jan 2022 03:20 PM (IST)

మాస్కు పెట్టుకోకుండా కనిపించిన ఓ మంత్రి గారిని.. మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన చెప్పిన సమాధానం విని షాకైంది. ఆయన ఎవరో మీరే చూడండి.

మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!

ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రతిరోజూ మాస్కులు పెట్టుకోవాలని చెబుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ మంత్రిగారు ఏకంగా మాస్కుతో పనేముంది అంటున్నారు. మాస్కు తప్పనిసరి కాదని ప్రధాని మోదీ చెప్పారని సమర్థించుకున్నారు. అవును ఆయన ఎవరో మీరే చూడండి.

కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి.. అటవీ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మాస్కు లేకుండానే అక్కడికి వెళ్లారు. దీనిపై విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆయన ఇలా సమాధానమిచ్చారు.

ఏ ఒక్కరిపైనా ఆంక్షలు ఉండవని ప్రధాని మోదీ చెప్పారు. మాస్కు ధరించడం వ్యక్తిగత బాధ్యత. ఇది వ్యక్తుల విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మాస్కు పెట్టుకోవాలని అనిపించలేదు అందుకే ధరించలేదు.                                                   -  ఉమేశ్ కత్తి, కర్ణాటక మంత్రి

భారీగా కేసులు..

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మరోవైపు రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదుకాగా 441 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చెరింది. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది. 

1,88,157 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.83గా ఉంది.

Also Read: Corona Virus: కరోనాలాంటి వైరస్‌లను అంతం చేయలేం... పర్యావరణంలో భాగంగా కలిసిపోవడమే వాటి ముగింపు, WHO కీలక వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 19 Jan 2022 02:00 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.