CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు
తమిళనాడు ఊటీ సమీపంలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ చాపర్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ABP Desam Last Updated: 09 Dec 2021 07:18 AM
Background
తమిళనాడు కూనూర్లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్...More
తమిళనాడు కూనూర్లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా కూనూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి.సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్లో ఉన్నట్లు తెలుస్తోంది.ఘటన సమాచారం అందుకున్న స్థానిక మిలిటరీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికి పైగా కాలిన 2 బాడీలను ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్- ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.