CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు
తమిళనాడు ఊటీ సమీపంలో ఓ సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ చాపర్లో సీడీఎస్ బిపిన్ రావత్ ఉన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మృతదేహాలను గురువారం ఢిల్లీ తీసుకురానున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలకు అంతిమ నివాళులర్పించేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అంత్యక్రియల ఊరేగింపు కామరాజ్ మార్గ్ నుండి ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రంలోగా వారి పార్థివ దేహాన్ని సైనిక విమానంలో దేశ రాజధానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సాయుధ దళాల సిబ్బందిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. వాళ్లంతా దేశానికి అత్యంత శ్రద్ధతో సేవ చేశారని గుర్తు చేశారు.
జనరల్ బిపిన్ రావత్ నిబద్దత కలిగిన సైనికుడని... నిజమైన దేశభక్తుడని అన్నారు ప్రధాని. దేశ సాయుధ దళాలను, భద్రతా యంత్రాంగాన్ని ఆధునీకరించడంలో ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. వ్యూహాత్మక విషయాలపై అతనికి చాలా పట్టుందని అలాంటి వ్యక్తి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు మోదీ.
సీడీఎస్ బిపిన్ రావత్ను కోల్పోవడం దేశానికి చాలా లోటు అని అభిప్రాయపడ్డారు కేంద్రహోమంత్రి అమిత్షా. చాలా విషాదకరమైన రోజని... మాతృభూమికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవ చేసిన వీర సైనికుల్లో ఒకడు మృతి చెందడం బాధాకరమన్నారు. అతని ఆదర్శప్రాయమైన సహకారం, నిబద్ధత మాటల్లో చెప్పలేమన్నారు.
ఆయనతోపాటు ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారందరికీ అమిత్షా సంతాపం తెలిపారు. మధులికా రావత్, మరో 11 మంది మృతి తనను కలచి వేసిందన్నారు. ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ఆయా కుటుంబాలకు ప్రసాందించాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరలోనే కోలుకోవాలన్నారు అమిత్షా.
ధైర్యవంతుడైన బిడ్డను భారత్ కోల్పోయిందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రావత్ దుర్మరణంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో హోంశాఖ, రక్షణ, విదేశీ, ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొంటారు.
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పార్లమెంటులో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతర పరిస్థితులను రాజ్నాథ్ సమీక్షిస్తున్నారు. ఈరోజు సాయంత్ర ఘటనాస్థలానికి రాజ్నాథ్ సింగ్ వెళ్లనున్నారు.
సిడిఎస్ బిపిన్ రావత్ ఉన్న మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలానికి వెళ్లనున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఆయనే స్వయంగా ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించారు. రెస్క్యూ ఆపరేషన్లలో అవసరమైన సహాయాన్ని అందివ్వాలని లోకల్ అధికారులను ఆదేశించారాయన.
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ సీడీఎస్ బిపిన్ రావత్ ఇంటికి వెళ్లారు. ఢిల్లీలోని రావత్ ఇంటికి ఆర్మీ అధికారులతో కలిసి వెళ్లారు.
హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నట్లు తెలుస్తోంది.
హెలికాప్టర్ కూలిన ఘటన అనంతర పరిస్థితులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షిస్తున్నారు. రక్షణ శాఖ ఉన్నతాధికారుల సమావేశం ప్రస్తుతం జరుగుతోంది. మరికాసేపట్లో ప్రమాదంపై రాజ్నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలిని నేపథ్యంలో ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చాదరీ.. సూలూర్ ఎయిర్బేస్కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోయంబత్తూర్ బయలుదేరారు.
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిశాక షాక్కు గురయ్యానన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రావత్ త్వరగా కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిశాక షాక్కు గురయ్యానన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రావత్ త్వరగా కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో గాయపడిన సీడీఎస్ బిపిన్ రావత్ సహా ఇతర సిబ్బందికి అత్యున్నత వైద్య సాయం అందించాలని ఆరోగ్యశాఖకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. వెంటనే అత్యున్నత వైద్య సిబ్బందిని నీలగిరి వెళ్లాలని తెలిపారు. స్టాలిన్.. కాసేపట్లో కోయంబత్తూర్ వెళ్లనున్నట్లు సమాచారం.
హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని మోదీ అత్యవసరంగా మంత్రిమండలిని సమావేశ పరిచారు. ప్రమాదంపై ప్రధానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. కాసేపట్లో పార్లమెంట్లో కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది.
Background
తమిళనాడు కూనూర్లో ఓ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సూలూర్ వైమానిక స్థావరం నుంచి వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి(డీఎస్సీ) వెళ్తుండగా కూనూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి జిల్లాలోని కొండ ప్రాంతాల్లో శిథిలాలు పడిపోయాయి.
సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఆయన భార్య, డిఫెన్స్ అసిస్టెంట్, సెక్యూరిటీ కమాండోలు, ఐఏఎఫ్ పైలట్లు.. మొత్తం 14 మంది చాపర్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటన సమాచారం అందుకున్న స్థానిక మిలిటరీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 80 శాతానికి పైగా కాలిన 2 బాడీలను ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్- ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -