Train Ticket Upgrade: దేశంలో ప్రతిరోజూ లక్షల మంది రైళ్లలో ప్రయాణిస్తారు. ప్రతి ఒక్కరూ తక్కువ ధరకే అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకుంటారు. అందుకే స్లీపర్ టిక్కెట్లతో కూడా, ప్రజలు తరచుగా AC కోచ్లో ప్రయాణించే అవకాశం లభించాలని కోరుకుంటారు. అయితే టికెట్ బుక్ చేసినప్పుడు మీరు చిన్న పని చేస్తే మీరు స్లీపర్ క్లాస్ టికెట్తోనే ఏసీలో దర్జాగా ప్రయాణం చేయవచ్చు.
చాలా సార్లు, ప్రజల దగ్గర AC టికెట్ బుక్ చేసుకోవడానికి డబ్బు ఉండదు, కాబట్టి వారు స్లీపర్ క్లాస్లో ప్రయాణిస్తారు. కానీ స్లీపర్ టికెట్తో కూడా మీరు AC కోచ్లో ప్రయాణించవచ్చని మీకు తెలుసా? కానీ దీన్ని చేయడానికి, మీరు ముందుగా ఒక పని చేయాలి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందా.
రైల్వేలు తరచుగా ప్రయాణ సమయంలో సీట్లను రీఆర్గనైజేషన్ చేస్తుంటాయి. అంటే AC కోచ్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే, ఈ సమయంలో ప్రయాణీకులను ఇతర కోచ్లలో సీట్ల దొరక్కుంటే ఇక్కడకు మారుస్తూ ఉఫంటుంది. ఇందతా కూడా ఆటోమేటింగ్గా జరుగుతూ ఉంటుంది. అందువల్ల, మీ స్లీపర్ టికెట్ను కూడా ACకి మార్చవచ్చు.
ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మీరు IRCTC ద్వారా ఆన్లైన్లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ఒక చినన పని చేయాలి. మీ టికెట్ బుకింగ్ వివరాలను నమోదు చేసిన తర్వాత, "మీరు ఆటోమేటిక్ అప్గ్రేడ్ కావడానికి సిద్ధంగా ఉన్నారా?" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనికి మీరు ఎస్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
మీరు నో అని చెబితే మీ టికెట్ మారదు. అయితే, మీరు ఏ ఎంపికను ఎంచుకోకపోతే, "అవును" అనే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. దీని అర్థం మీ వద్ద AC టికెట్ లేకుండా స్లీపర్ టికెట్ ఉన్నా సరే మీరు ACకి అప్గ్రేడ్ అవుతారు. ఇది మీకు బోనస్ అని లెక్క. ఈ సౌకర్యాన్ని రైల్వేలు అందించేందుకు మీ నుంచి ఎటువంటి అదనంగా డబ్బులు వసూలు చేయబోరు. స్లీపర్ టికెట్తో కూడా మీరు AC కోచ్లలో హాయిగా ప్రయాణించవచ్చు.
అదనంగా, AC కోచ్లలో సీట్లు అందుబాటులో ఉంటే, TTE స్లీపర్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను AC కోచ్లకు అప్గ్రేడ్ చేయవచ్చు. ముఖ్యంగా రాత్రి రైళ్లలో ఇది జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే కొంతమంది ప్రయాణీకులు చివరి నిమిషంలో ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి వారి టికెట్లను మీకు కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫెసిలిటీ సీట్లు ఖాళీగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.