Snake In Jabalpur Mumbai Garib Rath Express:  గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో పాము కలకలం రేపింది. నడుస్తున్న ట్రైన్‌లోనే పాము కనిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భీతిల్లిపోయారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి ముంబై వెళ్లే గరీభ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌లో పాము కనిపించింది. నడుస్తున్న రైలులోనే కాసర రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జీ 17 ఏసీ కోచ్‌లో పామును చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. 


ఏసీ బోగీలో అప్పర్‌బెర్త్‌ హ్యాండిల్‌ను చుట్టుకొని అటూ ఇటూ చూస్తూ పాము కాసేపు అలాగే ఉండిపోయింది. పామును చూసి భయపడిపోయిన ప్రయాణికులు పరుగులు తీశారు. వేరే కోచ్‌కు వెళ్లిపోయారు. కొందరు ధైర్యం చేసి పాము వీడియోను షూట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. 


కొందరు ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. కాసర రైల్వేస్టేషన్‌కు చేరుకునే సరికి స్నేక్ క్యాచర్స్ టీమ్ రెడీగా ఉంచారు. వాళ్లు ఆ పామును పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.