Karnataka Politics Updates:కర్ణాటక రాజకీయ యవనికపై సిద్దారామయ్య అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, పోరాటాలతో ఎదిగిన నిప్పు కణిక. అలాంటి వ్యక్తి తన పదవిని వేరే వ్యక్తికి అప్పగించి సైలెంట్‌గా వెళ్లిపోతారని ఎవరూ అనుకోరు. 1970వ దశకంలో మొదలైన సోషలిస్టు ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన ఈ నాయకుడు, అధికారాన్ని వదులుకోవడంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండలేదు. తాజాగా ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ, ఇది ఒక శకానికి ముగింపా లేక మరో రాజకీయ యుద్ధానికి నాందీ అనేది ఆసక్తికరంగా మారింది. 

Continues below advertisement

సిద్ధరామయ్య బ్యాక్‌గ్రౌండ్‌ 

సిద్ధరామయ్య ప్రాథమికంగా ఒక అరాచకవాదిగా పేరు ఉన్న సోషలిస్టు నాయకుడు. 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, రామకృష్ణ హెగ్డే నాయకత్వంలో మంత్రిగా పని చేశారు. జనతా పరివార్ నుంచి కాంగ్రెస్‌లోకి ఇంపోర్ట్ అయిన నాయకుడైనప్పటికీ పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. నితీష్ కుమార్, లాలు ప్రసాద్‌ యాదవ్‌ వంటి అదే తరం సోషలిస్ట్‌ నాయకుల వరుసలో నిలిచే చివరి గొంతుక సిద్ధరామయ్య. 

దశాబ్దాల రాజకీయ ప్రస్థానం తర్వాత సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక వ్యక్తి రాజీనామా కాదు, కర్ణాటకలో పాతుకు పోయిన సామాజిక సమీకరణాల మారవు. అవినీతి ఆరోపణలు, అంతర్గత అధికార పోరాటాలు, పరిపాలనలో మందకొడితనం వంటి కారణాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఈ నిర్ణయం పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. 

Continues below advertisement

2013నుంచి 2018 వరకుఐదేళ్ల పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ని చేసిన సిద్ధరామయ్య, 2023లో మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు పాత వైభవాన్ని కొనసాగించలేకపోయారు. 2023ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవ కోసం జరిగిన పోరాటంలో డీకే శివకుమార్‌ను వెనక్కి నెట్టి పదవిని దక్కించుకున్నప్పటికీ, అది ముళ్ల బాటగానే మిగిలిపోయింది. గత మూడేళ్లుగా ఆయన పట్టు సడలుతూ వచ్చింది. ఆయన పరిపాలనలో నైపుణ్యం తగ్గుతూ రావడం సొంత వర్గం వల్ల ఒంటరి కావడం వంటి ఆయనను బలహీనపరిచాయి. 

ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది

డీకే శివకుమార్‌ కేవలం ఒక నాయకుడిగా కాకుండా సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. పార్టీ పాత తరం నాయకులు కూడా శివకుమార్‌కు మద్ధతు తెలపడం సిద్ధరామయ్యకు ప్రతికూలంగా మారింది.  సిద్ధరామయ్యతో ఇక ముందుకు సాగడం రాజకీయంగా నష్టమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం. బలవంతంగా ఆయనను రాజీనామా వైపు నడిపించింది. 

రాజకీయాల్లో పైటర్‌గా ఉన్న ఎదిగిన సిద్ధరామయ్య 

2013లో సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీని చీల్చడానికైనా వెనుకాడరనే పరిస్థితి ఉండేది. మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్లను పక్కనపెట్టి ఆయన సీఎం అయ్యారు. 2018లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, జేడీఎస్‌తో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పొత్తు చెదిరిపోవడంలో  ఆయన పాత్ర ఉందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఓడిపోయిన ముఖ్యమంత్రి మళ్లీ 2023లో బలంగా తిరిగి రావడం కర్ణాటక చరిత్రలో అరుదు. ఎమ్మెల్యేల మద్దతు, రాహుల్ గాంధీ అండతో ఆయన మళ్లీ పగ్గాలు చేపట్టారు. 

కాంగ్రెస్ ముందు ఉన్న సవాళ్లు

సిద్ధరామయ్యను తప్పించడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆయనను తప్పించడం అంటే దశాబ్దాలుగా ఉన్న సామాజిక సమీకరణాలను మార్చడమే. అయితే ఆయన రాజ్యసభకు వెళ్లడానికి లేదా జాతీయ రాజకీయాల్లోకి రావడానికి సముఖంగా లేరు. బెంగళూరులోనే ఉంటూ కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఆయన ప్రశాంతంగా వెళ్లే రకం కాదని చరిత్ర చూస్తే అర్థమవుతుంది. భవిష్యత్‌లో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకొస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది.