Mukesh Ambani Death Threat: 



ఈ మెయిల్‌లో వార్నింగ్..


రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని (Mukesh Ambani) చంపేస్తానంటూ బెదిరింపు మెయిల్‌ రావడం అలజడి సృష్టించింది. ముకేశ్ అంబానీ కంపెనీ మెయిల్ ఐడీకి గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్ పంపాడు. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరించాడు. "రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం. మా దగ్గర బెస్ట్ షూటర్స్ ఉన్నారు" అని మెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ మొదలు పెట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...రాత్రి 8.51 నిముషాలకు ఈ మెయిల్ వచ్చింది. షదాబ్ ఖాన్‌ పేరుతో ఈ మెయిల్ వచ్చినట్టు సెక్యూరిటీ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ మెయిల్‌ని ఫొటో తీసిన సెక్యూరిటీ ఆ ఫొటోను పోలీసులకు పంపింది సెక్యూరిటీ. గతంలోనూ ఇలానే ముకేశ్ అంబానీకి హత్యా బెదిరింపులు వచ్చాయి. గతేడాది బిహార్‌కి చెందిన ఓ వ్యక్తి ముకేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల్నీ చంపేస్తామని బెదిరించాడు. వెంటనే నిఘా పెట్టిన పోలీసులు ఆ నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.