పహల్గాం దాడితో ఉగ్రవాదులపై ప్రతీకార చర్యగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) గురించి చర్చ జరుగుతోంది. కాశ్మీర్లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. భారతదేశంలో పీవోకేలో చేరాలనే డిమాండ్లు పెరిగాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పీవోకే అనేది భారత్లోని భాగమే. త్వరలోనే పీఓకే భారతదేశంలో మళ్లీ చేరుతుందని చెప్పారు. పీవోకే యుద్ధం ద్వారా కాకుండా, చర్చల ద్వారా దేశానికి తిరిగి వస్తుందని అనుకోవాలా? ఇది ఎలా సాధ్యమని ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి.
కాశ్మీర్లోని ఒక భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకున్నందుకు దేశ ప్రజలకు ఇది బాధాకరమైన విషయంగా మిగిలిపోయింది. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి హుంజా లోయ వరకు భారతదేశంలోకి తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నాం అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ను తిరిగి తీసుకురావడం అనేది ప్రభుత్వం ప్రకటన మాత్రమేనా లేదా నిజంగా పీఓకేను తిరిగి భారత్లో విలీనం సాధ్యమవుతుందా అనే విషయాలపై రాజ్నాథ్ సింగ్ ప్రకటన కొన్ని సమాధానాలను ఇచ్చింది.
రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ చాలా చేయగలదని, కానీ శక్తితో పాటు సంయమనం అనే మార్గాన్ని ఎంచుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధిచెప్పాం. అయితే మన సైన్యం పవర్ ఉపయోగించి పీవోకేను పొందవచ్చు, కానీ సంయమన మార్గాన్ని ఎంచుకున్నాం. పాక్తో చర్చలు పీవోకేపై మాత్రమే జరుగుతాయి. దౌత్యం ద్వారా పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. భారతదేశం, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూసి పీవోకే తమ స్వరం వినిపిస్తుంది. భారతదేశంలో తాము భాగం అని, తిరిగి చేరతామని చెబుతుంది’ అన్నారు. 10 రోజుల్లో పీఎం మోదీ సైతం రెండుసార్లు పీవోకే గురించి ప్రస్తావించారు.
పీవోకే అంశాన్ని పదేపదే ప్రస్తావించడం అంటే పాకిస్తాన్పై చర్చలకు ఒత్తిడి పెంచడం. మరోవైపు భారత ప్రతినిధులు ప్రపంచంలోని పలుదేశాలకు వెళ్లి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని.. దాని ద్వారా ప్రపంచానికి కలుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ పాక్ పై దౌత్యపరంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పీవోకేను తిరిగి తీసుకురావడానికి రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మార్గం చర్చలు జరపడం, రెండవ మార్గం సైన్యాన్ని రంగంలోకి దింపి యుద్ధం చేయడం. పీవోకేపై మాట్లాడటానికి పాక్ మీద ఒత్తిడి పెంచి చర్చలకు రప్పించాలని ప్లాన్ చేస్తోంది కేంద్రం. అది అంత సులభం కాదు.
2019లో పార్లమెంట్లో అమిత్ షా పీవోకే గురించి ప్రకటన చేసినప్పుడు, దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. పీవోకే భారత్ లోని ఓ ముక్క మాత్రమే కాదు, అది ముఖ్యమైన భాగం. గిల్గిట్ నుంచి బాల్టిస్తాన్ వరకు ఉన్న ప్రాంతం భూతల స్వర్గం లాంటిది.
పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ భాగం మూడు భాగాలు అయింది. పాకిస్తాన్ ద్వారా చైనా ఆక్రమణలోకి వెళ్ళిన ఒక భాగం, దీనిని అక్సాయి చిన్ అని పిలుస్తారు. రెండవ భాగం గిల్గిట్ బాల్టిస్తాన్, మిగిలిన మూడవ భాగం పీవోకే. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లోని 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు ఇచ్చింది. రెండవ భాగం అంటే గిల్గిట్లో 14 జిల్లాలు ఉండగా, మిగిలిన భాగం పీవోకేలో 10 జిల్లాలు ఉన్నాయి.
స్వాతంత్య్రం సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరి సింగ్ వేరుగా ఉండాలని చెప్పకపోతే పాకిస్తాన్ కాశ్మీర్లోని ఈ భాగాన్ని ఆక్రమించేది కాదు. 1947లో విభజన తర్వాత కొన్ని రోజులకు పీవోకే ఏర్పాటు ప్రారంభమయింది. 1947 ఆగస్టు 12న హరి సింగ్ భారత్లోనూ, పాకిస్తాన్తోనూ ఉండనని నిర్ణయించుకున్నాడు. జమ్మూ కాశ్మీర్ను స్వతంత్ర ప్రాంతంగా ఉంచాడు. కానీ కొన్ని రోజుల తర్వాత పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్లోకి చొచ్చుకువచ్చింది. 1947 అక్టోబర్ 22న - పాకిస్తాన్ గిరిజనులు ట్రక్కులలో కాశ్మీర్లోకి చొరబడ్డారు. అక్టోబర్ 23న జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. దాని తరువాత
- 1947 అక్టోబర్ 24న మహారాజా హరి సింగ్ భారత సైనిక సహాయం కోరారు. అదే సమయంలో గిరిజనులు శ్రీనగర్ వైపు దూసుకుపోతున్నారు.
- 1947 అక్టోబర్ 25న భారత ప్రభుత్వం హరి సింగ్ను భారత్లో విలీన పత్రంపై సంతకం చేయాలని కోరింది. అటు పాకిస్తాన్ సైన్యం గిరిజనలతో కలిసి కాశ్మీర్లోకి చొరబడి కొంత ప్రాంతాన్ని ఆక్రమించింది.
- 1947 అక్టోబర్ 26న హరి సింగ్ శ్రీనగర్ నుంచి జమ్మూకు వచ్చారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనంపై ప్రకటన చేశాడు.
- 1947 అక్టోబర్ 27న భారత సైన్యం శ్రీనగర్ చేరుకుని పాక్ సైన్యాన్ని కట్టడి చేయడంతో పరిస్థితి అదుపులోకి తీసుకుంది.
- 1948 జనవరి 1న భారతదేశం కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేవనెత్తింది. 1949 జనవరి 1న యుద్ధ విరామం జరిగింది.
భారతదేశానికి చెందిన భాగం పాకిస్తాన్ వద్దకు వెళ్ళిపోయింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, బీజేపీ పీవోకేను తిరిగి విలీనం చేస్తామని పదేపదే చెప్పింది. గత ప్రభుత్వాలు ఎక్కడ తప్పు చేశాయో గుర్తు చేసింది. మధ్యప్రదేశ్లోని సతనలో ఘటన గురించి అర్థం చేసుకోండి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ తన భార్యతో కలిసి చిత్రకూట్లో జగద్గురు రామభద్రాచార్యను దర్శించుకోగా, జగద్గురు గురుదక్షిణగా పీవోకేను తిరిగి భారత్లో విలీనం చేయాలని కోరారట.
పీవోకే ఇన్ని సంవత్సరాలకు ఎందుకు స్పందించింది ? మరి స్వయంగా రావాలంటే ఇన్నేళ్లు ఎందుకు గడిచాయి. అంటే దానికి సమాధానం పీవోకే పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పాకిస్తాన్ పాలనపై అసంతృప్తి, పీవోకేను ఉగ్రవాద కేంద్రంగా ఉపయోంచడం ఓ కారణం. ఆపరేషన్ సింధూర్లో లష్క, జైష్ ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఎక్కువ భాగం పీవోకేలో ఉన్నాయి.
పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లో వారిపై వ్యతిరేకత వినిపిస్తున్న చిత్రాలు సర్వసాధారణం. పీవోకేలో ముజఫ్ఫరాబాద్, నీలం లోయ, మీర్పూర్, కోట్లీ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి, కానీ పాకిస్తాన్ తమ స్వలాభం కోసం వాటి రూపురేఖలు మార్చింది. మీర్పూర్ నుండి భింబర్ లోయ వరకు నివసించే ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది శ్రీనగర్, సోనమార్గ్, గుల్మార్గ్ ప్రజల వంటి జీవితాన్ని కోరుకుంటున్నారు.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దశలో ఉంది. ఉద్యోగాల నుంచి మౌలిక సదుపాయాల వరకు బలమైన పునాది ఏర్పడుతోంది. పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది.
- జమ్మూ కాశ్మీర్ జీడీపీ 2,20,204 కోట్లు, పీవోకే జీడీపీ అందులో మూడో వంతు అంటే 77,723 కోట్లు.
- జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 1,06,641 కోట్ల బడ్జెట్ కేటాయించారు, పీవోకేకు 7,921 కోట్లు.
- జమ్మూ కాశ్మీర్లో 35 కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, పీవోకేలో కేవలం 6 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ తో పోల్చితే పీఓకేలో ఏది సరిగ్గా లేదు..
- జమ్మూ కాశ్మీర్ మొత్తం విస్తీర్ణం 2,22,236 చదరపు కిలోమీటర్లు.
- భారతదేశం వద్ద ప్రస్తుతం 1,01,387 చదరపు కిలోమీటర్లు ఉంది. పాకిస్తాన్ వద్ద 78,114 చదరపు కిలోమీటర్లు, చైనా వద్ద 42,735 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది.
భారతదేశం వద్ద ఉన్న దానికంటే చైనా, పాకిస్తాన్ ఆక్రమణలో అధిక భూభాగం ఉంది. పాకిస్తాన్ పీవోకేలోని పెద్ద భాగాన్ని చైనాకు అప్పగించింది. దాంతో చైనా పాకిస్తాన్లో తమ ప్రభావాన్ని పెంచుకుంటూ భారత్ పై ఆధిపత్యం కోసం చూస్తోంది. రోడ్డు ద్వారా కొత్త మార్గాన్ని నిర్మిస్తోంది. చైనా గిల్గిట్ ద్వారా పాకిస్తాన్లోకి వెళ్తుంది. పీవోకే భారతదేశంలో చేరితే, అన్ని రకాల విభజన సమస్యల నుంచి ఉగ్రవాదం వరకు పరిష్కారం అవుతాయి. పీవోకే భారతదేశంలో చేరితే, పాకిస్తాన్, చైనా మధ్య సంబంధం బలహీనపడుతుంది. పీవోకే ద్వారా ఆ దేశాలు సహచరులుగా ఉన్నాయి. పీవోకే లభిస్తే, భారత సరిహద్దులు నేరుగా ఆఫ్ఘనిస్తాన్తో కలుస్తాయి.
విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. పాకిస్తాన్తో చర్చించాల్సింది కేవలం పీవోకే సమస్యపై మాత్రమే అని చెప్పింది. పీవోకేపై పదే పదే మాట్లాడటం, విదేశాలకు భారత ఎంపీ ప్రతినిధుల బృందాలను పంపించి దౌత్యపరంగా పాక్ మీద కనిపించని యుద్ధాన్ని చేస్తోంది.