PM Modi Oath Ceremony LIVE: ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం - కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు

PM Modi Oath Taking Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

Ganesh Guptha Last Updated: 09 Jun 2024 09:54 PM

Background

PM Modi Oath Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ తరవాత వరుసగా మూడోసారి...More

కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు ఎవరంటే..

న్యూఢిల్లీ: కిషన్ రెడ్డి చెప్పినట్లుగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసాపురంలో నెగ్గిన బీజేపీ ఎంపీ శ్రీనివాస శర్మలతో రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌.. మోదీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. వీరితో పాటు వ్యాపార ప్రముఖులు ముఖేష్ అంబానీ, సిని సెలబ్రిటీలు కొందరు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.