Parliament Monsoon Sessions: 


ట్వీట్ చేసిన ప్రహ్లాద్ జోషి 


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలు కానున్నాయి. పార్లమెంటరీ కమిటీ క్యాబినెట్ కమిటీ ఈ సమావేశాల తేదీల్ని ఖరారు చేసింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా ట్వీట్ చేశారు. 


"పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలవుతాయి. ఆగస్టు 11వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నాను"


- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి