Governor vs Govt in Karnataka :ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్లో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆ వైరస్ కర్ణాటకకు చేరింది. కర్ణాటకలో కూడా జీ రామ్ జి బిల్లు విషయంలో విభేదాలు మొదలయ్యాయి. జనవరి 22, 2026న కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ యూటీ ఖాదర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హెచ్కే పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సలీం అహ్మద్, బసవరాజ్ హోరట్టి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కోసం ఎదురు చూస్తున్నారు. గెహ్లాట్ సభకు చేరుకుని ప్రసంగ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. కానీ 2-4 లైన్లు చదివిన తర్వాత, ఆ స్పీచ్ను పక్కన పెట్టారు. అతను సభ నుంచి వెళ్లిపోయారు. బీకే హరిప్రసాద్ ఆయన్ని ఆపేందుకు ప్రయత్నించారు, కాని గవర్నర్ఆగలేదు.
కర్ణాటకలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం
జనవరి 22 నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశం సిద్ధరామయ్యకు చాలా ప్రత్యేకమైనది. అయితే, దీనికి ముందు, థావర్ చంద్ గెహ్లాట్ అసెంబ్లీ, విధాన పరిషత్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి నిరాకరించారు. ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలలో మార్పులు అవసరమని గెహ్లాట్ అన్నారు. ఈ పరిణామం రాజ్యాంగ సంప్రదాయాలు, గవర్నర్ పాత్రపై కొత్త చర్చను లేవనెత్తింది. వాస్తవానికి, ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలోని మొత్తం 11 పేరాలపై గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వీటిలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించే అంశాలు ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించాలని గెహ్లాట్ అన్నారు, అయితే వాటిని తొలగించడానికి బదులుగా భాషలో పరిమిత మార్పులు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఇదే కారణంతో గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ముగించి సభ నుంచి వెళ్లిపోయారు.
మంత్రి పాటిల్ గెహ్లాట్ను కలిసి ఒప్పించారు
కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్ భవన్ను సందర్శించి గవర్నర్ను కలిసింది. ఆర్టికల్ 176(1) ప్రకారం గవర్నర్ ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తప్పనిసరి అని, ఈ ప్రసంగాన్ని మంత్రిమండలి తయారు చేస్తుందని మంత్రి పాటిల్ అన్నారు. ప్రసంగంలో ఏదైనా అభ్యంతరకరమైన భాష ఉంటే, ప్రభుత్వం దానిని సవరించవచ్చు, కాని మొత్తం పేరాను తొలగించడం ఆమోదయోగ్యం కాదు అన్నారు.
తమిళనాడులో కూడా గవర్నర్ సభ నుంచి వెళ్ళిపోయారు
జనవరి 20న తమిళనాడులో ఇలాంటి సన్నివేశం చూశాం. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీలో వాకౌట్ చేశారు. సమావేశం మొదటి రోజునే గవర్నర్, ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమిళ గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరగా, స్పీకర్ తిరస్కరించారు. జాతీయ గీతాన్ని అవమానించారని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు.