Jaishankar Speech In UNGA: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్​ను మరోసారి కడిగిపారేశారు. పాకిస్థాన్​ ఉగ్రవాదానికి కేంద్రబిందువు అని అభివర్ణించారు. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య (UNGA) 80వ సమావేశంలో పవర్​ఫుల్​ స్పీచ్​ ఇచ్చారు. పాకిస్తాన్‌ను ‘ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రం’ అని అన్నారు. జైశంర్​ మాట్లాడినంత సేపు ప్రపంచ దేశాల సభ్యులు తమ చప్పట్లతో ఆయనకు మద్దతుగా నిలిచారు.

Continues below advertisement

ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా పరిగణిస్తోంది

‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్‌మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్’ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జరిగిన ఉన్నత స్థాయి జనరల్ డిబేట్‌లో జైశంకర్ భారత్​కు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రసంగించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్​ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ విధానంగా పరిగణిస్తోందని విమర్శించారు. భారత్​కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్​ నుంచి ఉగ్రవాద సవాల్​ను ఎదుర్కొంటోందని, పొరుగు దేశంగా ఉన్న తమపై దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

Continues below advertisement

ప్రపంచ ఉగ్రవాదుల లిస్ట్​ పాకిస్థానీలతో నిండి ఉంది“ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ ఉగ్రవాదుల జాబితా పాకిస్థాన్​ జాతీయులతో నిండి ఉంది. ఇందుకు తాజా ఉదాహారణే పహల్గాం ఉగ్ర దాడి. ఏప్రిల్​లో పహల్గాంలో అత్యంత పాశవిక ఉగ్రదాడి చేసి 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్నారు.” అని జయశంకర్​ అన్నారు. “దీంతో భారత్​ ఆపరేషన్ సిందూర్ చేపట్టి తన ప్రజలను రక్షించుకునే హక్కును ఉపయోగించుకుంది. దాడి చేపట్టిన నిర్వాహకులు, నేరస్థులకు బుద్ధి చెప్పి బాధితులకు న్యాయం చేశాం” అని అన్నారు. 

ఆ దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలిఉగ్రవాదాన్ని అణచివేయడమే భారతదేశానికి అత్యంత ప్రాధాన్యమైన అంశ మంత్రి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం అనేది మతోన్మాదం, హింస, అసహనాన్ని ప్రేరేపిస్తుందని అన్నారు. ఉగ్రవాదులకు రక్షణ, షెల్టర్​ ఇస్తూ వారికి స్వర్గధామంలా నిలుస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జైశంకర్​ గ్లోబల్​ కమ్యూనిటీని కోరారు. 

నిస్సంకోచంగా ఖండించాలి‘‘దేశాలు బహిరంగంగా ఉగ్రవాదాన్ని తమ స్టేట్​ పాలసీగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాద కేంద్రాలు పారిశ్రామిక స్థాయిలో నడుస్తున్నప్పుడు, ఉగ్రవాద కార్యకలాపాలు బహిరంగంగా జరుపుకున్నప్పుడు అటువంటి చర్యలను సంకోచం లేకుండా ఖండించాలి’’ అని జైశంకర్ నొక్కి చెప్పారు. టెర్రర్​ ఫైనాన్సింగ్​ను అరికట్టాలని, హైప్రొఫైల్​ ఉగ్రవాదులపై తీవ్ర ఆంక్షలు విధించాలని కోరారు. 

తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందిఉగ్రవాదం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జైశంకర్ హెచ్చరించారు. ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు కాబట్టి, దీనిపై సీరియస్​గా దృష్టి సారించాలని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో సభ్య దేశాలు ఐక్యంగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. జైశంర్​ ప్రసంగానికి  UNGA ప్రతినిధుల విశేష మద్దతు లభించింది. ఆయన ప్రసంగించినంత సేపు తమ చప్పట్లతో మద్దతు తెలిపారు. ఆయన మాటల తీవ్రత ఉగ్రవాద వ్యాప్తిపై ప్రపంచ దేశాల ఆందోళనను నొక్కిచెప్పాయి.