Indian Passport Fee Hike 2026: విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. పాస్‌పోర్ట్‌ నియమాలు, 2026 కింద వివిధ కేటగిరీల పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఫీజులను పెంచుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక దశాబ్ధానికిపైగా కాలం తర్వాత ఈ ఫీజులను సవరించడం ఇదే తొలిసారి. 

Continues below advertisement

పాస్‌పోర్ట్ ధరల పెంపు

భారత్ ప్రభుత్వం చివరిసారిగా 2012లో పాస్‌పోర్ట్ ఫీజులను సవరించింది. అప్పట్లో సాధారణ 36 పేజీల పాస్‌పోర్ట్‌ ధరను 1000 నుంచి 1500 పెంచారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ప్రస్తుత పరిపాలనా ఖర్చులు, సేవల మెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జులై 1 లేదా ఆ తర్వాత సమర్పించే అన్ని దరఖాస్తులకు ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. 

కొత్త రుసుములు వివరాలు ఇలా ఉన్నాయి

36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌ కోసం ప్రస్తుతం 1500 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు 2500 వసూలు చేయనున్నారు. 60 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ కోసం ఇప్పటి వరకు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు.ఇకై 3500 రూపాయలు ఫీజు వసూలు చేయనున్నారు. తక్షణ అవసరాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి 36పేజీల పాస్‌పోర్ట్ ధ 5000కు పెరిగింది. దీని కోసం గతంలో 3500 రూపాయలు చెల్లించేవారు. 60 పేజీల తత్కాల్‌ పాస్‌పోర్ట్ ధర 6000 రూపాయలకు పెరిగింది. గతంలో దీని కోసం నాలుగు వేల రూపాయలు వసూలు చేసేవారు. 

Continues below advertisement

పాస్‌పోర్ట్ లాస్ అయితే!

పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా లేదా పాడైపోయినా కొత్తది పొందడం ఇప్పుడు మరింత భారంగా మారింది. 36 పేజీల పాస్‌పోర్ట్ కోసం సాధారణ కేటగిరిలో ఐదు వేలు, తత్కాల్‌లో 7500 రూపాయలు వసూలు చేయనున్నారు. 60పేజీల పాస్‌ పోర్ట్ కోసం సాధారణ కేటగిరీలో 6000, తత్కాల్‌లో  8500 రూపాయలు వసూలు చేస్తారు. 

మైనర్ల కోసం ప్రత్యేక రాయితీలు 

18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ల కోసం ప్రభుత్వం కొంత రాయితీని కొనసాగిస్తోంది. మైనర్లు కొత్త లేదా రీ ఇష్యూ 36 పేజీల పాస్‌పోర్ట్ ధర 1750 గా నిర్ణయించారు. తత్కాల్‌ పథకం కింద మైనర్లు పాస్‌పోర్ట్ రుసుము 4250గా ఉంటుంది. మైనర్‌ు తమ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే, దాని భర్తీకి సాధారణ కేటగిరీలో 4250, తత్కాల్‌లో 6750 రూపాయలు చెల్లించాలి. 

ఇతర సేవల రుసుములు

పాస్‌పోర్ట్ ధరలతోపాటు ఇతర అనుబంధ సేవల ధరలను కూడా కేంద్రం సవరించింది. పోలీస్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం భారత్‌లో 750 రూపాయలు, విదేశాల్లో 40 డాలర్లను వసూలు చేయనున్నారు. సరెండర్ సర్టిఫికెట్‌, గ్లోబల్‌ ఎంట్రీ ప్రోగ్రామ్‌ వెరిఫికేన్ కోసం 750 రూపాయలు వసూలు చేస్తారు. సర్టిఫికెట్ ఆఫ్ ఐడెంటిటీ కోసం వెయ్యి రూపాయలు భారత్‌లో, విదేశాల్లో అయితే 50 డాలర్లు ఫీజుగా చెప్పారు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ భారత్‌లో ఉచితంగా ఇస్తారు. విదేశాల్లో దరఖాస్తు చేసుకుంటే 15 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.