Just In

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు కేంద్ర మంత్రి ఘన స్వాగతం- సాయంత్రం మోదీతో విందు, ఢిల్లీలో భద్రత పెంపు

ప్రతి భారత పౌరుడు తెలుసుకోవలసిన రాజ్యాంగంలోని 15 ముఖ్యమైన ఆర్టికల్స్, వాటి ప్రయోజనాలు

అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా చిలుకూరికి అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్న కేంద్ర రైల్వే శాఖ

వైసీపీ నేతపై ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు నమోదు, స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్న పోలీసులు

ఈ ఏడాదిలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సీఎస్కేపై రివేంజ్ తీర్చుకున్న ముంబై.. రోహిత్, సూర్య విశ్వరూపం - జడ్డూ, దూబే హాఫ్ సెంచరీలు వృథా
ఇండియా పేరు మార్పుపై పరోక్షంగా ప్రధాని మోదీ క్లారిటీ, G20 సదస్సులో నేమ్ప్లేట్పై 'భారత్'
India Bharat Name Change Row: G20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్ ప్లేట్పై భారత్ అని రాసుండడం ఆసక్తికరంగా మారింది.
Continues below advertisement

G20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చున్న చోట నేమ్ ప్లేట్పై భారత్ అని రాసుండడం ఆసక్తికరంగా మారింది. (Image Credits: ANI)
India Bharat Name Change Row:
Continues below advertisement
ప్రధాని నరేంద్ర మోదీ G20 సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మొరాకోలో భూకంప విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డవాళ్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ కష్టకాలంలో మొరాకో దేశానికి ఎలాంటి సాయమైనా అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. మోదీ కూర్చున్న స్థానంలో ముందు నేమ్ప్లేట్ ఆసక్తికరంగా మారింది. దానిపై India కి బదులుగా Bharat అని రాసుంది. పేరు మార్పుపై ఇప్పటికే చర్చ జరుగుతుండగా ప్రధాని మోదీ నేమ్ప్లేట్పై ఆ పేరు కనిపించింది. విపక్షాలు దీనిపై ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మండి పడుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో భారత్ అని కనిపించడం వల్ల కేంద్రం అందుకు సిద్ధంగానే ఉందని సంకేతాలిచ్చినట్టైంది.
Continues below advertisement