Independence Day 2022 Live Updates: గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

దేశం నేడు 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు.

ABP Desam Last Updated: 15 Aug 2022 10:43 AM

Background

దేశం నేడు 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోనుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై దేశం మొత్తం మాత్రమే కాదు, ప్రపంచం దృష్టి ఉంటుంది. గత 75 ఏళ్లలో...More

KCR Independence Day Celebrations: గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన సీఎం కేసీఆర్

గోల్కొండ కోట‌పై తెలంగాణ సీఎం జాతీయ జెండాను ఎగుర‌వేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివ‌ర్ణ శోభితంగా విల‌సిల్లుతోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వేలాది మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు త‌మ ప్రాణాలు ఆర్పించి వెలుగును చాటారు. మ‌హానీయుల త్యాగాల వ‌ల్లే స్వాతంత్ర్య ఫ‌లాలు అనుభ‌విస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి భార‌తీయుడి హృద‌యం ఉప్పొంగే స‌మ‌య‌మిది అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సంద‌ర్భం ఇదని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్రభుత్వం పిలుపునిచ్చిందన్నారు. .దేశ‌భ‌క్తిని చాటే అనేక కార్యక్రమాలను జ‌రుపుకోవాలన్నారు. ప్రతి భార‌తీయుడి గెండు అనందంతో ఉప్పొంగే స‌మ‌య‌మిదని చెప్పారు.