S Jaishankar: కెనడాలో ఖలిస్థాననీ ఉగ్రవాది హత్యపై భారత్ కు, కెనడాకు మధ్య దౌత్యపరమైన వివాదం రాజుకుంది. ఈ ఉద్రిక్తతల నడుమ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇవాళ ఉదయం పార్లమంట్ భవనంలో ప్రధానితో సమావేశమైన జైశంకర్.. వివాదం గురించి ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు, కెనడాలో భారతీయుల పరిస్థితిపై కూడా ఎస్ జైంశకర్ ప్రధాని మోదీకి నివేదించినట్లు సమాచారం.


ఖలిస్థానీ సానుభూతి పరుడు, ఖలిస్థాన్‌ టైగర్స్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య జరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని విశ్వసనీయమైన ఆరోపణలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని భారత రాయబారిపై వేటు వేశారు. కెనడా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. జూన్‌ 18న కెనడాలోని బ్రాంప్టన్‌ పట్టణంలోని గురుద్వారా సాహిబ్‌ పార్కింగ్‌లో హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అతడు మరణించాడు. అయితే ఇందులో భారత హస్తం ఉందన్నది కెనడా వాదన. 


హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలపై భారత్ స్పందించింది. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, ప్రేరేపితమైనవని అన్నారు. సర్రేలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్యలో భారత్ పాత్ర ఉందనడాన్ని తోసిపుచ్చారు.


కెనడా, భారత్‌ మధ్య దౌత్య సంబంధాలు హీన దశకు చేరుకుంటున్నాయి. ఖలిస్థానీ అతివాద భావజాలం రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. పదేపదే కోరినప్పటికీ జస్టిన్‌ ట్రూడో అతివాదాన్ని అణచివేయడంలో విఫలమయ్యారు. తాజాగా ఆ దేశంలో జరిగిన ఖలిస్థాన్‌ టైగర్ ఫోర్స్‌ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనక భారత్‌ పాత్ర ఉన్నట్టు ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది.


అంతేకాకుండా మన దేశ ఇంటెలిజెన్స్‌ అధికారిని జస్టిన్‌ ట్రూడో బహిష్కరించారు. మోదీ ప్రభుత్వం సైతం అంతే దీటుగా స్పందించింది. కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. దాంతో ఇక్కడి కంపెనీల్లో కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (CPPIB) పెట్టిన పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉంటుందోనన్న ఆందోళన మొదలైంది. బుధవారం స్టాక్‌ మార్కెట్లు మొదలయ్యాక వీటిపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది.


భారత కంపెనీల్లో కెనడా పెన్షన్‌ బోర్డు ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెట్టింది. ఈ విలువ రూ.లక్ష కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. జూన్‌ త్రైమాసికానికి డెల్హీవరీలో కెనడా ఫెన్షన్‌ ఫండ్‌కు ఆరుశాతం వాటా ఉంది. సోమవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే ఈ విలువ రూ.1878  కోట్ల వరకు ఉంటుంది. ఇక కొటక్‌ మహీంద్రాలో 1.15 బిలియన్ల కెనడా డాలర్లను ఇన్వెస్ట్‌ చేసింది. అంటే మొత్తం కంపెనీలో దీని వాటా 2.68 శాతం. జూన్‌ త్రైమాసికంలో 1.66 శాతం వాటా అమ్మినప్పటికీ తన వాటా విలువ రూ.9,582 కోట్ల మేరకు ఉంటుంది.