Chandrayaan-3: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. నిర్దేశించిన సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా వెళ్లని జాబిలి దక్షిణ ధ్రువానికి చేరుకుంది ఇస్రో. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఈ అద్భుతమైన ఘనతను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ కొనియాడుతున్నారు. 


'మానవ సమాజానికి మరో అతిపెద్ద ముందడుగు! చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ కావడం మానవుని ప్రతిభకు నిదర్శనం. ఈ అద్భుతమైన విజయం వెనక ఉన్న మేధావులకు అభినందనలు' అని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ట్విట్టర్ లో పోస్టు చేశారు.






'140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు' అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోస్టు చేశారు.






'చంద్రయాన్-3 కి శుభాకాంక్షలు! దాని అద్భుతమైన విజయానికి అభినందనలు. ఇస్రోకు సెల్యూట్.భారత్ ఇప్పుడు అంతరిక్షంలో సూపర్ లీగ్ లో ఉంది. సాహసయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.






'ఇది సాటిలేని విజయం. ఈ అద్భుతమైన విజయం ఇస్రో అచంచలమైన స్ఫూర్తికి నిదర్శనం. వారి నిబద్ధత, నిరంతర కృషి ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశాయి' అని ఆప్ నేత రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు.






'1962లో ప్రారంభమైన భారతదేశ అంతరిక్ష కార్యక్రమం నేడు చంద్రయాన్-3 రూపంలో కొత్త శిఖరాన్ని నెలకొల్పింది. దేశ ప్రజలందరికీ ఇది సంతోషకరమైన క్షణం. శాస్త్రవేత్తలకు, దేశ ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. జై హింద్' అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. 






'చంద్రయాన్-3 మిషన్ ప్రయోగం విజయవంతం అయినందుకు ఇస్రోకు అభినందనలు. చంద్రుని ఉపరితలాన్ని జయించిన నాల్గో దేశంగా భారత్ నిలవడం చిరస్మరణీయ విజయం. భారతదేశ అంతరిక్షణ పరిశోధనలకు ఇదో పెద్ద ముందడుగు' అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. 


The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి


https://news.abplive.com/chandrayaan-moon-landing/amp/amp