Election 2023 Live: మిజోరంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - ఛత్తీస్ గఢ్ లోనూ 10 స్థానాలకు ముగిసిన ఓటింగ్

Election 2023 Live: మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు చత్తీస్‌గడ్‌లో మొత్తం 90 స్థానాల్లో 20 స్థానాలకు తొలి దశలో పోలింగ్ ప్రారంభమైంది. దీని కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ABP Desam Last Updated: 07 Nov 2023 04:18 PM

Background

Assembly Election 2023 Voting Live: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. తొలిదశలో ఛత్తీస్‌గఢ్‌లోని 20 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ (నవంబర్ 7) పోలింగ్ ప్రారంభమైంది. మిజోరంలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి....More

మిజోరంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - ఛత్తీస్ గఢ్ లోనూ 10 స్థానాలకు ముగిసిన ఓటింగ్

మిజోరంలో 40 స్థానాలకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ 3 గంటల వరకూ సాగింది. మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ ప్రత్యేకంగా నిలిచింది. మరోవైపు, ఛత్తీస్ గఢ్ లో 10 స్థానాలకు మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ పూర్తైంది.