Ambulance Accident Karnataka: అత్యంత వేగంగా అంబులెన్స్‌ను టోల్‌బూత్‌ను ఢీ కొట్టిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు, టోల్ బూత్ సిబ్బంది సహా నలుగురు మృతి చెందారు.






ఇదీ జరిగింది


ఉడిపీ జిల్లాలోని కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్స్‌లో హొన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. భారీ వర్షంలో కూడా ఆ అంబులెన్స్‌ వేగంగా ప్రయాణిస్తోంది. అంబులెన్స్ రాకను గమనించిన టోల్ బూత్ సిబ్బంది ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించి ప్రత్యేక లైన్‌లో దానికి దారి ఇచ్చేందుకు ప్రయత్నించారు.






అయితే అతి వేగంగా వస్తున్న అంబులెన్స్ తడిచి ఉన్న రోడ్డుపై అదుపు తప్పింది. చక్రాలు జారిపోవడంతో అంబులెన్స్ టోల్ బూత్ క్యాబిన్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి అంబులెన్స్‌లో ఉన్న రోగి, ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. వీరు ముగ్గురు మృతి చెందారు.


అలాగే అంబులెన్స్ ఢీ కొట్టడంతో టోల్‌ బూత్‌‌లో పని చేసే ఓ వ్యక్తి కూడా చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Also Read: Corona Cases: రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసులు- కొత్తగా 21 వేల మందికి వైరస్


Also Read: Central Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై కేంద్రం కీలక ప్రకటన- మిషన్ మోడ్‌లో భర్తీ!