ఫిబ్రవరి 24-25 తేదీల్లో ABP నెట్‌వర్క్ "ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్" రెండో ఎడిషన్ నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల నెలకొన్నాయి. అలాగే దేశంలో సాధారణ ఎన్నికలకు ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ఈ సందర్భంలో ఏబీపీ నెట్ వర్క్  ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ తో మీ ముందుకు వచ్చింది. ఈ ఏడాది థీమ్ 'నయా ఇండియా: లుకింగ్ ఇన్‌వర్డ్, రీచింగ్ అవుట్'. ఈ ఏడాది సమ్మిట్ లో పలువురు వ్యాపార దిగ్గజాలు, సాంస్కృతిక రాయబారులు, రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.


ప్రపంచ రాజకీయ పరిస్థితులపై 


ప్రపంచం వ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు, ప్రతీకారం, పునరుద్ధరణ కోరుకునే శక్తులు చరిత్రను సవాలు చేస్తున్న తరుణంలో ఈ సదస్సు జరుగుతోంది. సాంకేతికత సమాజ రూపురేఖల్ని మార్చుతున్న సమయం, సైన్స్ అసాధ్యమైన వాటిని సాధిస్తున్న సమయం కూడా ఇది. ఉక్రెయిన్ పై రష్యా దాడి ఏడాదికి చేరువవుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ నుంచి ఊహించనంత ప్రతిఘటన ఎదుర్కొంటున్న తరుణం,  అయినా రష్యా వెనక్కి తగ్గే సూచనలు లేకపోవడం. చైనాలో కోవిడ్-19 మహమ్మారిని కంట్రోల్ చేయడానికి కఠిన నిబంధనలు అమలుచేయడంతో భారీ నిరసనలు చెలరేగాయి. 



అంతర్జాతీయ అంశాలపై 


 దేశ హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించిన 22 ఏళ్ల మహ్సా అమిని కస్టడీ మరణానికి ప్రతిస్పందనగా వేలాది మంది ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు, ముఖ్యంగా మహిళలు వీధుల్లోకి రావడాన్ని ఇరాన్ చూసింది. ఉత్తర అమెరికాలో, సంప్రదాయవాద శక్తులు ఉదారవాద ప్రజాస్వామ్య పునాదులను బెదిరిస్తున్నాయి. దక్షిణాసియా ఆర్థిక అస్థిరతతో బాధపడుతోంది. సరిహద్దుల వెంబడి స్వేచ్ఛ కోసం జీవితాన్ని పణంగా పెట్టి, ప్రవేశం కోసం శరణార్థులు అనంతంగా ఎదురు చూస్తున్నారు. ఉపాధి, పెరుగుతున్న ఖర్చులు ఇంట్లో ప్రధాన సమస్యలుగా కొనసాగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ మూలాధారం అధికారంలో మార్పు, పాత పొత్తుల గురించి ప్రశ్నించడం. 


'నయా ఇండియా' పై చర్చ 
 
2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం ఒక్క ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ చరిత్రలో భారతదేశం ఎక్కడ నిలుస్తుంది? తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు, రిసర్జెంట్ సౌత్ ఇండియా, రాజకీయ వ్యతిరేకత, అసహనంతో ఉన్న నేటి తరం అన్ని రంగాలలో నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందా?  ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది  'మేక్ ఇన్ ఇండియా' వైపు ప్రయత్నాలను వేగవంతం చేసింది. దేశంలోకి బయట నుంచి పెట్టుబడులు, స్థానిక తయారీ, ఉపాధిని బలోపేతం చేయడం. ఇలాంటి ముఖ్యమైన అంశాలను ఏబీపీ నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ రెండో ఎడిషన్‌లో చర్చించనున్నారు. ఈ సమ్మిట్ లో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్వనీ వైష్ణవ్, నటులు ఆశా పరేఖ్, ఆయుష్మాన్ ఖురానా,  రచయితలు అమితవ్ ఘోష్, దేవదత్ పట్నాయక్ వంటి ప్రముఖులు పాల్గొని 'నయా ఇండియా' అంటే ఏమిటి అనేదానిపై చర్చించనున్నారు.