Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు, అమరులైన నలుగురు భద్రతా సిబ్బంది

Doda: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

Continues below advertisement

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ ఎదురు కాల్పుల్లో  ఆర్మీ అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 

Continues below advertisement

రాత్రి 8.45 గంటల సమయంలో ధారి గోటే ఉర్బాగీ వద్ద రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ కూడా ప్రతిగా కాల్పులు జరిపింది. 

20 నిమిషాలకుపైగా సాగిన ఈ కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో నలుగురు అమరులైనట్టు అధికారులు తెలిపారు.

భారత సైన్యం ఏం చెప్పిందంటే.
ఈ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని, ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

"ఈ ప్రాంతానికి అదనపు దళాలను పంపారు, ఆపరేషన్ కొనసాగుతోంది" అని వైట్ నైట్ కార్ప్స్ అని కూడా పిలువబడే ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.

ఈ దాడికి ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్  బాధ్యత తీసుకుంది. దోడాలో భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Continues below advertisement
Sponsored Links by Taboola