BrahMos Missile to Philippines: రక్షణ రంగంలో ఎప్పటికప్పుడు సామర్థ్యాన్ని పెంచుకుంటున్న భారత్ ఇప్పుడు ఎగుమతులపైనా దృష్టి సారించింది. ఎంతో కీలకమైన BrahMos సూపర్‌ సోనిక్ క్రూజ్‌ మిజైల్‌ని ఫిలిప్పైన్స్‌కి అప్పగించింది. రెండేళ్ల క్రితం భారత్, ఫిలిప్పైన్స్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ మిజైల్‌ కోసం ఫిలిప్పైన్స్ 375 మిలియన్ డాలర్లు చెల్లించింది. 2022 జనవరిలో ఈ డీల్ కుదిరింది. భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన ఈ మిజైల్‌ని తొలిసారి ఎగుమతి చేశారు. 2024-24 మధ్య కాలంలో రక్షణ రంగ ఎగుమతులను రూ.35 వేల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఎగుమతులు 32.5%కి పెరిగాయి. రూ.21 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఈ క్రమంలోనే దేశీయంగా ఆయుధాల తయారీపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి పెడుతోంది. ఏప్రిల్ 1వ తేదీన రక్షణశాఖ ఇదే ప్రకటన చేసింది. 






31 రెట్లు పెరిగిన ఎగుమతులు..


2014తో పోల్చి చూస్తే ఈ పదేళ్లలో రక్షణ రంగ ఎగుమతులు 31 రెట్లు పెరిగాయి. Indian Air Force C-17 జెట్‌ ద్వారా ఈ మిజైల్‌ని అందించారు. ఈ యాంటీ షిప్ క్రూజ్ మిజైల్‌ రేంజ్ 290 కిలోమీటర్లు. నిజానికి భారత్‌ వద్ద లాంగ్ రేంజ్ మిజైల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పైన్స్‌కి అందించింది షార్ట్ వేరియంట్.





రక్షణ రంగంలో ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్టార్‌కి 60% వాటాఉండగా డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్‌కి 40% వాటా ఉంది. భారత్ ఇప్పుడు 85 దేశాలకు మిలిటరీ హార్డ్‌వేర్ ఎగుమతి చేస్తోంది. ఇందుకోసం 100 దేశీయ సంస్థలు పని చేస్తున్నాయి. ఈ ఎగుమతుల్లో మిజైల్స్‌, ఆర్టిలరీ గన్స్, రాకెట్‌లు, సాయుధ వాహనాలు, రకరకాల రేడార్స్, వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు, నిఘా వ్యవస్థలు ఉన్నాయి.






Also Read: టేస్ట్ కోసం నాన్‌వెజ్‌లో ఆ మసాలా వేస్తున్నారా? జాగ్రత్త అందులో పురుగుల మందు ఉందట!