Anurag Kashyap explosive remark: బాలీవుడ్ చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణ వర్గాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్న అనురాగ్ ఇటీవల సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆయనకు సమస్యలు ఏర్పడ్డాయి. సెన్సార్ కావడంలేదు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) , బ్రాహ్మణ సమాజంలోని ఒక వర్గంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "బ్రాహ్మణులపై నేను మూత్రం పోస్తానని" వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వివాదానికి దారితీశాయి. కొందరు ఇది అనురాగ్లోని బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని చూపిస్తుందని, బాధ్యతారహితంగా సమాజాన్ని రెచ్చగొట్టెలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు అతని చిత్రంలో బ్రాహ్మణులను అవమానించే అంశాలు ఉన్నాయని ధృవీకరిస్తున్నాయని అంటున్నారు. అందుకే సీబీఎఫ్సీ సెన్సార్ చేయడం లేదని.. భావిస్తున్నారు.
అనురాక్ కశ్యప్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అతని వ్యాఖ్యలు కుల విద్వేషాన్ని రెచ్చగొడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణ సమాజంలో ఆగ్రహాన్ని, ఏకీకరణ రావాలని కొందరు పిలుపునిస్తున్నారు.
అనురాగ్ కశ్యప్ గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక-రాజకీయ అంశాలపై నేరుగా వ్యక్తం చేసే అభిప్రాయాలు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి.
అనురాగ్ కశ్యప్ తీరుపై బాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఫూలే మూవీ బయటకు వస్తుందా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు. కానీ రిలీజ్ డేట్ ప్రకటించారు.