𝐓𝐚𝐦𝐚𝐧𝐧𝐚𝐚𝐡 𝐁𝐡𝐚𝐭𝐢𝐚  𝐋𝐢𝐧𝐤 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐇𝐏𝐙 𝐓𝐨𝐤𝐞𝐧 𝐒𝐜𝐚𝐦 : హెచ్‌పీజడ్ క్రిప్టో కరెన్సీ పేరుతో మల్టీ క్రోర్ స్కాం జరిగినప్పుడు దేశంలో సంచలనం సృష్టించింది. భారీ ఎత్తున లాభాలు వస్తాయని..బిట్ కాయిన్స్ మైనింగ్ చేస్తామని ప్రచారం చేసుకున్న HPZ టోకెన్ అనే సంస్థ మోసాలకు పాల్పడింది. ఈ సంస్థపై మొదట నాగాలాండ్ లో కేసు నమోదు అయింది. హెచ్‌పీజడ్ టోకెన్ సంస్థ ప్రత్యేక యాప్ ను సిద్ధం చేసి అసలు లేని క్రిప్టో కరెన్సీ మైనింగ్ మెషిన్స్ మీద పెట్టుబడి పెట్టాలని ప్రజల్ని నమ్మించింది. ఈ సంస్థ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మనీలాండరింగ్ కు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. 


ఈ కేసులోనే తమన్నా భాటియాను ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నించింది. అయితే తమన్నా ఈ స్కాంలో నేరుగా ఎక్కడా పాల్గొనలేద.కానీ హెచ్‌పీజడ్ సంస్థ నుంచి ఆమెకు కొన్ని పేమెంట్స్ అందాయి. ఆ పేమెంట్స్ కేవలం ఆ సంస్థ నిర్వహిచిన ఈవెంట్స్ పాల్గొనేందుకు చేసినవి. ఈ అంశంపై ప్రశ్నించేందుకే ఈడీ ఆమెను పిలిపిచింది. ఈ యాప్ విషయంపై తమన్నాపై ఎలాంటి ఆరోపణలు కానీ..మనీలాండరింగ్ చేసినట్లుగా కేసులు కానీ లేవు. అదే సమయంలో ఈ యాప్ విషయంలో ఆమె ఇన్వాల్వ్ మెంట్ ఉన్నట్లుగా కూడా ఎక్కడా ఈడీ చెప్పలేదు. ఓ ఈవెంట్ కు హాజరవడం వల్ల ఆమెకు అందిన డబ్బు విషయంలో మాత్రమే ప్రశ్నించేందుకు పిలిపించారు.  


మూడేళ్ల కిందట ఈ కంపెనీపై మొదటి సారి నాగాలాండ్ లోని కోహిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అవడానికి నాగాలాండ్ కేంద్రమే అయినా హైదరాబాద్‌లోనూ లింకులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతున్న మూడు చైనీస్ కంపెనీలకు ఈ యాప్ తో సంబంధాలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీ హైదరాబాద్ లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద రిజిస్టర్ అయ్యాయి. యాప్ ద్వారా సేకరిస్తున్న నగదును  ఈ మూడు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారు. 
 
క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేయాలంటే పెద్ద పెద్ద యంత్రాలు కావాలని ఆ యంత్రాల కోసం పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ప్రజల్ని పిచ్చోళ్లను చేశారుఈ యాప్ నిర్వహకులు. అయితే ఇలాంటి యంత్రాలు ఉంటాయని.. వాటిని కొంటామని కూడా ఎక్కడా ఆ కంపెనీ ఎవరికీ చెప్పలేదు. అలాంటి పనులు కూడా చేయలేదు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి నిధులు సేకరించి దారి మళ్లించారు. ఈ కేసులో ఈడీ పూర్తి విచారణ జరిపి 76 చైనా సంస్థలకు సంబంధం ఉందని.. 299 మంది వ్యక్తులు ఈ స్కాంలో పాలు పంచుకున్నారని గుర్తించారు. వీరిలో చైనీస్ నేషనల్స్ దేశం పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పటికే చాలా మంది దేశం దాటి పోయారన్న ఆరోపణలు ఉన్నాయి.                


అంటే ఈ యాప్ మంచిదని తమన్నా ప్రచారం చేసి డబ్బులు తీసుకున్నారు. అదొక్కటే ఆమెను ఈడీ విచారణ వరకూ తీసుకొచ్చింది.