UP Car Accident News: 


యూపీలో ప్రమాదం..


యూపీలోని బరేలి నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. కార్‌ ట్రక్‌ని ఢీకొట్టిన ఘటనలో ఓ చిన్నారి సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 9న రాత్రి పూట ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. పెళ్లికి వెళ్లి వస్తున్న సమయంలో కార్‌ ట్రక్‌ని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే కార్‌లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 8 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. సెంట్రల్ లాక్ వేసి ఉండడం వల్ల తప్పించుకునే దారి కూడా లేకుండా పోయింది. ట్రక్‌ డంపర్‌ని కార్ బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఓ టైర్‌ పేలిపోయింది. అదుపు తప్పి పక్క రోడ్డుపైకి దూసుకెళ్లింది. ట్రక్ కొంత దూరం వరకూ కార్‌ని లాక్కెళ్లింది. 


"భోజిపుర వద్ద  హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కార్‌ ట్రక్‌ని బలంగా ఢీకొట్టింది. కొంత దూరం వరకూ కార్‌ని ట్రక్‌ లాక్కెళ్లింది. టైర్ పేలిపోయింది. వెంటనే కార్‌లో మంటలు చెలరేగాయి. సెంట్రల్ లాక్‌ వేయడం వల్ల డోర్‌లు ఓపెన్ కాలేదు. లోపల ఉన్న వాళ్లంతో మంటల్లో పడి కాలిపోయారు. అన్ని మృతదేహాలనూ బయటకు తీశాం. వీళ్లలో ఓ చిన్నారి డెడ్‌బాడీ కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం పంపాం. చనిపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్నాం. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది"


- పోలీస్ ఉన్నతాధికారులు