Bharat Bandh: దేశవ్యాప్తంగా 'భారత్ బంద్' ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దుల్లో ట్రాఫిక్ భారీ స్తంభించిపోయింది.

Continues below advertisement

కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సాగిస్తోన్న పోరాటానికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు నేడు 'భారత్ బంద్'కు పిలుపునిచ్చారు. దిల్లీ, పంజాబ్, హరియాణా రహదారులపై రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Continues below advertisement

ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన బంద్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, దుకాణాలు, పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఆసుపత్రులు, మెడికల్ స్టోర్లు యథావిధిగా సాగుతున్నాయి.

కిసాన్ భారత్ బంద్..

  • 40 సంఘాల రైతులు ఏకతాటిపైకి వచ్చి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేెఎమ్) ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాలను వెళ్లనివ్వటం లేదు. దిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ వేను ఘాజీపుర్ వద్ద రైతులు దిగ్బంధించారు. 
  • గురుగ్రామ్-దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్ ఉంది. దిల్లీలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
  • అంబులెన్స్‌లు, ఆసుపత్రులు యథావిధిగా నడుస్తాయని వాటిని మేం ఆపడం లేదని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసినట్లు తెలిపారు.
  • దిల్లీ, పంజాబ్, హరియాణాతో పాటు కర్ణాటక, బిహార్‌లోనూ భారత్ బంద్ కొనసాగుతోంది.
  • కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ, టీడీపీ.. సహా పలు విపక్షపార్టీలు ఈ బంద్‌కు మద్దతిచ్చాయి.

Cyclone Gulab Latest: తుపాను తీరం దాటిన టైంలో జరిగిన బీభత్సం ఇదీ.. వెల్లడించిన కలెక్టర్, రేపు ఇంకో అల్పపీడనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement
Sponsored Links by Taboola