AP Telangana News Live Updates: రమ్య హత్యపై కూడా రాజకీయాలా.. మీ హయాంలో ఏం చేశారు.. ఏపీ హోంమంత్రి సూటిప్రశ్న

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబిత కీలకంగా వ్యవహరించారని సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది.

ABP Desam Last Updated: 17 Aug 2021 03:30 PM

Background

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీబీఐ షాక్ ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల లీజు కేటాయింపుల్లో మంత్రిగా సబిత కీలకంగా వ్యవహరించారని సీబీఐ కోర్టులో కౌంటరు దాఖలు చేసింది....More

రమ్య హత్యపై కూడా రాజకీయాలా.. మీ హయాంలో ఏం చేశారంటూ ఏపీ హోంమంత్రి సూటిప్రశ్న

రమ్య హత్యను సైతం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దిశా చట్టాన్ని ప్రచార ఆర్భాటాలకు వాడుకోవాలని చూస్తున్నారంటే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జాతిలో పుట్టాలా అనే తరహా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు నేడు దళితుల కోసం మొసలి కన్నీళ్లు కార్చుతున్నారని విమర్శించారు.