వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Feb 2023 06:46 PM
జగన్ వెంటే నడుస్తానంటూ కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేసిన కార్పొరేటర్

నెల్లూరు రూరల్ లో ఆధిపత్య పోరు మొదలైంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటే అందరు కార్పొరేటర్లు ఉంటారనుకుంటే సడన్ గా ఆ లెక్కలు మారాయి. జై జగన్, జై ఆదాల అంటూ కొందరు తిరుగుబాటు స్వరం వినిపించారు. దీంతో కోటంరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తన మాట విననంటున్న కార్పొరేటర్ల ఇంటికెళ్లి రాయబారం నడిపించాలనుకున్నారు. కానీ వాళ్లు తిరగబడ్డారు. తమని బెదిరిస్తున్నారంటూ ఏకంగా ఓ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి. తాను జగన్ వెంట నడుస్తానని ఎంపీ ఆదాలకు మద్దతు పలికారు. దీంతో కోటంరెడ్డి మధ్యాహ్నం తన ఇంటికొచ్చారని, తనపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది కోటంరెడ్డే అయినా, తాను జగన్ పార్టీపై గెలిచానని, ఆయనతోనే ఉంటానన్నారు. పోలీసులు ఈ వ్యవహారం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామన్నారు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం పర్వతగిరి మండలం సొమారం గ్రామం వద్ద వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను BRS కార్యకర్తలు చింపివేశారు. మంత్రి కాన్వాయ్ లో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మమ్మల్ని ఎదుర్కోలేక మంత్రి ఎర్రబెల్లి  చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు.  

కాళేశ్వరం పూర్తి చేసి సాగు విస్తీర్ణం పెంచాం: గవర్నర్

కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టి ని ఆకర్షించామన్నారు. దీని ఫలితంగానే సాగు ఇరవై లక్షల ఎకరాల నుంచి 73. 33 లక్షల ఎకరాలకు పెరిగింది. త్వరలో కోటి ఎకరాలకు పేగా సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రశంసలు దక్కాయి. రైతులకు 65వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించాం. రైతుకు ఐదు లక్షల విలువైన జీవిత బీమా అందిస్తున్నాం. - తెలంగాణ గవర్నర్

ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్‌ 


తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ తమిళి సై ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సమావేశాల్లో ఆమె ప్రసంగిచడం ఇది రెండో సారి. తెలంగాణ అభివృద్ధికి దేశానికి మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తుందన్నారు. సీఎం, ప్రజాప్రతినిధుల కృషితోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణలో ఎన్నో విజయాలు సాధించాం. సంక్షేమ, అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా ఉన్నామన్నారు. 

నేను చేసింది నమ్మకద్రోహం అయితే నువ్వు చేసిందేంటీ? అనిల్‌ను ప్రశ్నించిన కోటంరెడ్డి

మాజీ మంత్రి అనీల్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఆడియోలు వీడియోలు విడుదల చేయాలని సలహా ఇచ్చారు. తనను అరెస్టు చేస్తామంటూ చాలా మంది మీడియాకు లీకులు ఇస్తున్నారని... దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని సవాల్ చేశారు. కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్టులు అయ్యారని... అప్పుడు కనిపించని సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాకు ఇన్‌ఛార్జ్ ఎలా అయ్యారని అన్నారు. తనను నమ్మకద్రోహి అంటున్న అనిల్ కుమార్‌ ఆనం ఫ్యామిలీకి చేసిందేంటని ప్రశ్నించారు. 

Background

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Viswanath) ఇకలేరు. గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.


ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడే మరణించారు (K Viswanath No More). 


విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఆయన ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చేశారు. ఆయన తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు. 


తొలుత సౌండ్ రికార్డిస్ట్...
తర్వాత దర్శకుడిగా!
సినిమాల్లో విశ్వనాథ్ కెరీర్ సౌండ్ రికార్డిస్ట్ గా మొదలైంది. వాహిని స్టూడియోస్ లో ఆయన తొలి ఉద్యోగం అదే. ఆ తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. మన సినిమా పరిశ్రమ ఎప్పటికీ గర్వంగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటైన 'పాతాళ భైరవి' చిత్రానికి ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారు.
 
తొలి సినిమాకు నంది
'ఆత్మ గౌరవం' సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. దానికి నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి లభించింది. కథకు కూడా నంది పురస్కారం లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 'చెల్లెలి కాపురం', 'శారదా', 'ఓ సీత కథ', 'జీవన జ్యోతి' చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో నందులు అందుకున్నాయి. నందులు అందుకున్న సినిమాలు ఇంకెన్నో ఉన్నాయి. 




 



'శంకరాభరణం'తో జాతీయ పురస్కారం
విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆణిముత్యాల్లో 'శంకరాభరణం' ఒకటి. దానికి ఉత్తమ సినిమాగా నంది మాత్రమే కాదు... జాతీయ అవార్డు కూడా వచ్చింది. 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్' విభాగంలో నేషనల్ అవార్డు అందుకుంది. 'సప్తపది', 'స్వాతిముత్యం', 'సూత్రధారులు', 'స్వరాభిషేకం' సినిమాలకూ నేషనల్ అవార్డులు వచ్చాయి. 'స్వాతి ముత్యం' సినిమాను ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో 59వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా పంపించారు. 


పద్మశ్రీ విశ్వనాథ్
చిత్రసీమకు విశ్వనాథ్ చేసిన సేవలకు గాను ఆయన్ను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ ఆయన దర్శకత్వం వహించారు. 'శుభ సంకల్పం' సినిమాతో నటుడిగా మారిన ఆయన, ఆ తర్వాత పలు చిత్రాల్లో పాత్రలకు ప్రాణం పోశారు. విశ్వనాథ్ అనేది తెలుగు చిత్రసీమలో ఒక పేరు కాదు, చరిత్ర. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో విశ్వనాథ్ నటించారు. ఎనిమిది సార్లు ఆయన ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. ఆయన్ను 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సత్కరించింది. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు. 


Also Read: కె.విశ్వనాథ్ కెరీర్‌లో ఆ మూవీ ఓ మైలురాయి - కానీ, అది మానసికంగా చాలా బాధించిందట!


Also Read: తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ‘శంకరాభరణం’ రిలీజైన రోజే అస్తమించిన కళాతపస్వి!


Also Read: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు


Also Read: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు


Also Read: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!


Also Read: హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక


Also Read: విశ్వనాథ్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకొని బాల్య స్నేహితులు కన్నీరు


Also Read: దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.