Breaking News Live Telugu Updates: అధికారుల్ని డిమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Nov 2022 09:18 PM
అధికారుల్ని డిమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్

అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం: బండి సంజయ్ కుమార్


బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ


హైదరాబాద్: ట్రాన్స్ కో, జెన్ కో సంస్థల్లో అధికారుల్ని డెమోట్ చేయడం కెసిఆర్ తుగ్లక్ పాలనకు నిదర్శనం.
* కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.
* తెలంగాణ అధికారుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకోం
* కేసీఆర్ చేసిన తప్పులకు అధికారులు బలి అవుతున్నారు
* బకాయిలు చెల్లించకుండా కేసీఆర్  విద్యుత్ సంస్థల్ని  నష్టాల పాల్జేశారు. 
* ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కొత్త పే రివిజన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయినా కూడా ఉద్యోగులు కష్టపడి సంస్థలను కాపాడుకుంటున్నారు.
* ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే ఉన్న ఉద్యోగుల్ని  తొలగిస్తున్నారు. ప్రమోషన్లు ఇవ్వమంటే డిమోషన్ చేస్తున్నారు.
 * డిమోషన్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి.
* బాధిత అధికారులు చేసే పోరాటానికి బిజెపి అండగా ఉంటుంది.

Kondapur Suicide: మంత్రి పీఏ కుమారుడు ఆత్మహత్య

  • గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఆత్మహత్య

  • కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని తన నివాసం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు అక్షయ్ (23)

  • ఆత్మహత్య చేసుకున్న యువకుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి పీఏ కుమారుడిగా గుర్తింపు

  • ఉదయం 10 30 ప్రాంతంలో ఘటన జరిగినట్టు తెలిపిన పోలీసులు

  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు

TRS MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

  • బండి సంజయ్ అనుచరుడిగా ఆరోపణలు వినిపిస్తున్న అడ్వకేట్ శ్రీనివాస్ ను విచారిస్తున్న సిట్ అధికారులు

  • శ్రీనివాస్ ను గత ఐదు గంటలుగా విచారిస్తున్న సిట్

  • సింహయాజీ స్వామికి ఫ్లైట్ టికెట్స్ కొనుగోలు చేశాడని శ్రీనివాస్ పై ఆరోపణలు

  • అక్టోబర్ 26 న తిరుపతి నుండి హైదరాబాద్ కు సింహయాజి స్వామికి  శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినట్టు సిట్ గుర్తింపు..

  • సింహయాజితో శ్రీనివాస్ ఉన్న పరిచయాలపై సిట్ ఆరా

  • శ్రీనివాస్ తో సింహయాజికి ఫ్లైట్ టికెట్ బుక్ చేపించిన వ్యక్తులు ఎవ్వరన్నా దానిపై సిట్ దర్యాప్తు..

  • ఫోన్ కాల్ లిస్ట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆధారాలు ముందు ఉంచి విచారిస్తున్న సిట్..

  • రాజేంద్ర నగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిట్ విచారణ

  • సిట్ విచారణకు హాజరు కానీ బిఎల్ సంతోష్, జగ్గు స్వామి, తుషార్

Sankarabharanam: శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం!

గోవాలో జరిగే 53వ IFFI - 2022 లో  “శంకరాభరణం” చిత్రం , Restored Indian Classics విభాగంలో ఎంపికయ్యింది . National Film Archives of India వారు మన దేశంలొని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి, భద్ర పరిచే కార్యక్రమంలొ భాగంగా తెలుగులో విశేష ఆదరణ పొందిన, కళా తపస్వి కే. విశ్వనాథ్ రూపొందిన, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్, ఏడిద నాగేశ్వరావు నిర్మించిన "శంకరాభరణం" చిత్రం చోటు దక్కించుకుంది. అలా చేసిన చిత్రాల్లో కొన్ని ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. అందులో తెలుగు చిత్రం శంకరాభరణం ఒకటి. ఈ ప్రదర్శనకి ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరావు కుమారుడు ఏడిద రాజా  ప్రత్యేక  ఆహ్వానితులుగా హాజరవుతారు.



టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. సిట్‌ విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. సిట్‌ విచారణ స్వేచ్ఛగా జరిగేలా అవకాశం ఇవ్వాలని సుప్రీం స్పష్టం చేసింది. సిట్‌పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేసింది. సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను పరిష్కరించాలని జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ధర్మాసనం ఆదేశించింది. 

CM Jagan: నరసాపురంలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన కొనసాగుతూ ఉంది. అక్కడ పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నరసాపురం పురపాలక సంఘం మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం జగన్ ప్రసంగిస్తున్నారు.

ఒడిశాలో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్‌ రైలు- ముగ్గురు మృతి

ఒడిశాలోని కొరాయి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకెళ్లింది గూడ్స్‌ రైలు. ఈ దుర్ఘటలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ప్రమాదం కారణంగా ట్రైన్‌కు చెందిన పది బోగీలు బోల్తా పడ్డాయి. ఈ కారణంగానే ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. స్టేషన్‌లో ప్రమాదం జరగినందున... వెంటనే స్థానికులు  స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం- ట్రాక్టర్‌, గరుడ బస్ ఢీ- ముగ్గురు మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను తెలంగాణ ఆర్టీసీ గరుడ బస్‌ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. పదిమందికి గాయాలు అయ్యారు. కొత్తకోట మండలం ముమ్మాలపల్లిలో ఘోరం జరిగింది. మియాపూర్‌ డిపోకు చెందిన బస్ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఈ బస్‌ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 


ట్రాక్టర్‌ చెరకు లోడుతో వెళ్తోంది. టర్నింగ్‌లో ట్రాక్టర్ కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదంలో డ్రైవర్, ఆయన సహాయకుడు ఇద్దరూ చనిపోయారు. 

Background

ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. అదే తీవ్రతతో నెమ్మదిగా కదులుతోంది. 24గంటల్లో ఉత్తర వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలవైపు రానుంది. ఇది గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఆదివారం రాత్రికి శ్రీలంకలోని జాఫ్నాకు తూర్పుగా 540 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో, కారైకాల్‌కు తూర్పున 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 


ఇది వచ్చే 6 గంటల్లో ఇప్పుడున్న తీవ్రతతోనే కొనసాగనుంది. తర్వాత వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలబోతోంది. ఆ తర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇది 24 గంటల్లో దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు కదులుతుంది.


తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తీరాలవైపు వచ్చే క్రమంలో అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావం కారణంగా సోమవారం, మంగళవారం, బుధవారం దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది 






ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తాపై కూడా ఉంటుంది. కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చు. దక్షిణ కోస్తా, రాలయసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అలడిగా ఉంటుంది. మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. 
ఈ అల్పపీడం వల్ల కురిసే వర్షాలు, వీచేగాలులు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతుల బాగా పడిపోనున్నాయి. చలి బాగా పెరిగే అవకాశం ఉంది. 






తెలంగాణలో వాతావరణం


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మంగళవారం ఉరుములతో కూడిన చిరుజల్లులు పడొచ్చు. బుధవారం, గురువారం మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది. 






హైదరాబాద్‌లో సహా పలు ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 14డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈశాన్య, ఉత్తర దిశల నుంచి గాలులు గంటలు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అత్యధిక టెంపరేచర్‌ ఖమ్మంలో 31.6 డిగ్రీలు ఉంటే.. అత్యల్పం ఆదిలాబాద్‌లో 9.2 డిగ్రీలుగా నమోదు అయింది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.