Breaking News Live Telugu Updates: హెటిరో పరిశ్రమలో చిరుత పట్టివేత, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అధికారులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Dec 2022 03:17 PM

Background

విద్యావిధానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సరికొత్త మార్పు తీసుకొస్తోంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకొస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిఏపీ ప్రభుత్వం. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో...More

హెటిరో పరిశ్రమలో చిరుత పట్టివేత, మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించిన అధికారులు 

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం హెటిరో పరిశ్రమలో చిరుత చొరబడింది. అటవీ అధికారులు ఎట్టకేలకు చిరుతను పట్టుకున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నెట్స్ లో బంధించారు.  మూడు గన్స్ తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు అధికారులు. చిరుతను బంధించి జూకి తరలిస్తున్నారు.