Breaking News Live Updates: ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు అనుమతి
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
ABP Desam Last Updated: 04 May 2022 06:24 PM
Background
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివాహ వేడుక సహా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారం, దళితులు నిర్మించుకుంటున్న రైస్...More
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వివాహ వేడుక సహా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకారం, దళితులు నిర్మించుకుంటున్న రైస్ మిల్లుకు శంకుస్థాపన, ఓ సర్పంచ్ సోదరుడి వివాహానికి హాజరు కావడంతో పాటు పలు ఈవెంట్లలో మంత్రి కేటీఆర్ నేడు పాల్గొననున్నారు.ఉదయం 11 గంటలకు సిద్ధిపేటలోని రెడ్డి పంక్షన్ హాల్లో జరగనున్న అంకిరెడ్డిపల్లె సర్పంచ్ గోపాలరెడ్డి కుమారుడి వివాహానికి కేటీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ పదవీ బాధ్యతల స్వీకరణకు హాజరవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో ఎల్లమ్మ సిద్దోగానికి హాజరు కానున్నారు మంత్రి కేటీఆర్.మధ్యాహ్నం 1 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు దళితబంధు పథకంలో భాగంగా అక్కపల్లి స్టేజ్ వద్ద నిర్మించుకోనున్న రైస్ మిల్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఎల్లారెడ్డిపేటలో మధ్యాహ్నం 1:30 గంటలకు సాయిమణికంఠ గార్డెన్లో జరగనున్న రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుని వివాహానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు..దక్షిణ అండమాన్ సముద్రంలో అలజడి తెలుగు రాష్ట్రాలను వర్షాలతో ముంచెత్తింది. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, నాగోల్, ఖైరతాబాద్, అమీర్పేట, పంజాగుట్ట, వెస్ట్ మారేడ్ పల్లి, సికింద్రాబాద్, అంబర్ పేట, చిలకలగూడ, బోయిన్ పల్లి, తిరుమలగిరి, గుడిమల్కాపూర్, నాచారం, గోషామహల్, బాలానగర్, కాచిగూడ , గన్ఫౌండ్రీ, శివరాంపల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్, కూకట్ పల్లి, జగద్గిరిగుట్ట, కాప్రా ప్రాంతాల్లో బుధవారం వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది.భారీ వర్షం కారణంగా పవర్ కట్..భారీ వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అమీర్ పేట, మలక్ పేట, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, జూబ్లీహిల్స్, యూసఫ్గూడ, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్, కూకట్పల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం పవర్ కట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మోకాల్లోతు నీళ్లు నిలిచిపోగా, హైదరాబాద్లోని మరికొన్ని ఏరియాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చెట్లు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి మైత్రీవనం స్టేట్హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. అధికారులు వాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.భారీ ట్రాఫిక్..అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు చికురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఎల్బీనగర్ వద్ద రోడ్డు మీద ఉన్న గుంతలో కారు ఇరుక్కుపోయింది. అదే ఏరియాలో ఆర్టీసీ బస్సు వర్షపు నీటిలో చిక్కుకుపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.నేడు హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 4th May 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. తెలంగాణలో ఇంధన ధరలు..ఇక వరంగల్లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.119.22 కాగా, 13 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.23 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.కరీంనగర్లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, డీజిల్ ధర రూ.105.64 అయింది. నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్లో 36 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.17 కాగా, డీజిల్పై 35 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.107.04కి అయింది.ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..విజయవాడలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. పెట్రోల్ (Petrol Price in Vijayawada 4th May 2022) లీటర్ ధర రూ.121.07 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.106.69 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 26 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్పై 24 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.చిత్తూరులో పెట్రోల్ పై 59 పైసలు తగ్గడంతో లీటర్ రూ.121.48 కాగా, డీజిల్పై 55 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.02 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఓయూలో రాహుల్ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు ఆదేశాలు ఇవ్వాలని ఓయూ వీసీని ఆదేశించింది.