Breaking News Live Telugu Updates: హీరో విశాల్‌ ఫిర్యాదుపై సీబీఐ కేసు

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 05 Oct 2023 01:42 PM

Background

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు వెళ్లనున్నారు. సీఎం జగన్ మూడు రోజులు పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,...More

హీరో విశాల్‌ ఫిర్యాదుపై సీబీఐ కేసు  

మార్క్‌ ఆంటోనీ మూవీకి సంబంధించి సెన్సార్‌ బోర్డు లంచంగా 6.5 లక్షలు తీసుకున్నట్టు వచ్చిన వివాదంపై కేంద్రం సీరియస్‌గా రియాక్ట్ అయింది. హీరో  విశాల్ చేసిన ఆరోపణలపై ఏకంగా సీబీఐని రంగంలోకి దింపింది. మార్క్‌ ఆంటోని సినిమా హిందీ సెన్సార్‌ కోసం సీబీఎఫ్‌సీ 6.5 లక్షల డిమాండ్ చేసిందని విశాల్ ఆరోపించాడు. సెన్సార్‌ బోర్డు అవినీతిమైపోయిందని విమర్శలు చేశారు. దీంతో అత్యవసరంగా సమావేశమైన ప్రసార సమాచార శాఖ అత్యవసరంగా భేటీ అయింది.