Breaking News Live Telugu Updates: జీడిమెట్లలో కూతురిపై తండ్రి అత్యాచారం- ఇంటి నుంచి బయటపడితే అక్కడే అదే పరిస్థితి

Latest Telugu News In Andhra Pradesh and Telangana: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.

ABP Desam Last Updated: 05 Jan 2024 12:15 PM

Background

Andhra Pradesh Latest News And Telangana Latest News :  విజయవాడ(Vijayawada) టీడీపీ(TDP)లో మరోసారి కలకలం రేగింది. విజయవాడ ఎంపీ(Vijayawada MP) స్థానం వేరే వాళ్లకు ఇస్తున్నట్టు తెలుగుదేశం క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయాన్ని ప్రస్తుత ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)కి...More

Jayashankar Bhupalapalli News: తల్లిన చంపిన కుమారుడు- జయశంకర్‌ భూపాలపల్లిలో దారుణం

జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalapalli) జిల్లాలో దారుణం జరిగింది. రేగొండ (Regonda) మండలం తిరుమలగిరి(Tirumalagiri) గ్రామంలో తల్లిని చంపిన కుమారుడు చంపేశాడు. తిరుమలగిరి చెందిన కంచరకుంట్ల రాజీ రెడ్డి గొడ్డలితో  అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. అదే టైంలో తల్లిపై దాడి చేసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా గ్రామానికి చెందిన ఊకంటి జ్యోతి అనే మహిళ పై కూడా అటాక్ చేశాడు. ఆమె ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉంది. ఆమెను వెంటనే ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటన తర్వాత నిందితుడు కంచరకుంట్ల రాజిరెడ్డి పారిపోయాడు. గ్రామస్తులు అతన్ని వెతికి గోరుకొత్తపల్లి మండలం చిన్నకొడపాక గ్రామంలో పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు