= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Breaking News : హైదరాబాద్ చేరుకున్న ఆప్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్, కాసేపట్లో కేసీఆర్తో భేటీ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. ఇప్పటికే మమత, నితీష్తో సమావేశమై చర్చించారు. ఇప్పుడు సీఎం కేసీఆర్తో చర్చలు జరపబోతున్నారు.
ఢిల్లీలో సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ చేరుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్మాన్తో కలిసి సీఎంను కలవనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గండిపేట యూనియన్ బ్యాంక్ పైఅంతస్తులో అగ్ని ప్రమాదం- ఎగసిపడుతున్న మంటలు రంగారెడ్డి జిల్లా గండిపేట యూనియన్ బ్యాంక్ పై అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. పై అంతస్తులో ఉన్న లాప్ టాప్ ప్యాకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలను చూసిన స్థానికులు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. యూనియన్ బ్యాంక్కు మంటలు వ్యాపించకుండా జాగ్రత్తపడుతున్నారు నార్సింగీ పోలీసులు. కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జగ్గయ్యపేటలోని ఫార్మా కంపెనీలో విషవాయులు లీక్- ముగ్గురికి అస్వస్థత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఓ ఫార్మా కంపెనీ నుంచి విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆటోనగర్లోనీ శ్రీనివాస కెమికల్ ఫార్మాలో కెమికల్ గ్యాస్ లీక్ అయింది. ఈదుర్ఘటనలో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గగురయ్యారు. వారిని మొదట జగ్గయ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం విజయవాడ తరలించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నాపరాళ్ల కింద నలిగిన జీవితాలు- రేపల్లెలో ఘోర ప్రమాదం బాపట్ల జిల్లా రేపల్లెమండలం పెనుమూడి పంచాయతీ రావి అనంతవరం గ్రామ సమీపంలో నాపరాయి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నాపరాయితో వెళ్తున్న లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. తీవ్రగాయాలలైన ముగ్గుర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ఓ వ్యక్తి చనిపోయాడు. ఇద్దరికి రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ప్రస్తుతం చికిత్సస అందిస్తున్నారు. మాచర్ల నుంచి నాపరాయి లోడుతో ఈ లారీ రేపల్లె వెళ్తున్నట్లు సమాచారం.