Breaking News Live Telugu Updates: దసరా నుంచి విశాఖలోనే పాలన- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి- మంత్రులకు స్పష్టం చేసిన జగన్

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 20 Sep 2023 01:42 PM
నా సీటు పోయినా ఫర్వాలేదు- మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావాలే: కేటీఆర్

మాదాపూర్‌లో ఇంటర్నేషనల్‌ టెక్‌పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సీటు పోయినా ఫర్వాలేదు కానీ మహిళా రిజర్వేషన్ మాత్రం అమల్లోకి రావాలని ఆకాంక్షించారు. మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు.  

తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి

యాదాద్రి జిల్లా మోత్కూరు తిరుమలగిరి రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా, ఇద్దరు మృతి. పలువురికి గాయాలు

దసరా నుంచి విశాఖలోనే పాలన- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి- మంత్రులకు స్పష్టం చేసిన జగన్

కేబినెట్ భేటీలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా నుంచి విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అంతా సిద్ధంగా ఉండాలని కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. 

స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి

స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందాడు. ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి చనిపోయాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.


స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి

స్కూల్ బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి చెందాడు. ఉప్పలపాడు వద్ద మంగళవారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో అతను బస్సును పక్కకు ఆపి చనిపోయాడు. బస్సును ఆపడంతో విద్యార్థుల ప్రాణాలు దక్కాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.

చిరుత పోయి ఎలుగూ వచ్చే - తిరుమల నడక మార్గంలో ఎలుగు బంటి సంచారం

తిరుమలలో మరోసారి ఎలుగుబంటి హల్ చల్ చేసింది.. అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలురాయి వద్ద మంగళవారం రాత్రి ఎలుగుబంటి సంచరించింది. ఎలుగు బంటి సంచారాన్ని గుర్తించిన నడక మార్గంలోని సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన  ఎలుగు బంటి చాలాసేపు నడక మార్గంలోనే తిష్ట వేసింది.. అటవీ శాఖ సిబ్బంది ఘటన స్ధలానికి  చేరుకునే లోపు ఎలుగుబంటి అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి పోయింది.. ఎలుగుబంటి సంచరించి‌ ప్రదేశంలో మరికొన్ని ట్రాప్ కెమెరాలను అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎలుగుబంటిని బంధించేందుకు ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఏదీ ఏమైనప్పటికీ తరచూ అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల సంచారం అటు టిటిడిని, ఇటు అటవీ శాఖ అధికారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో మరింత అలర్ట్ గా అధికారులు వ్యవహరిస్తున్నారు..

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని జాతీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, ప్రజా సమస్యలపై చట్టసభల వేదిక వదులుకోకూడదన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సభలో పోరాటం చేద్దాం, వీధుల్లోనూ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని... సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా సాధిద్దాని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఉద్యమించాలని నిర్ణయించారు. 

రాజమండ్రిలో భువనేశ్వరిని పరామర్శించిన శైలజానాథ్

చంద్రబాబు అరెస్టు తీరును ఖండిస్తూ సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ శైలజానాథ్. నారా భువనేశ్వరిని పరామర్శించి సంఘాభావం ప్రకటించారు. రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని అభిప్రాయపడ్డారు. మంత్రులు శాఖాపరమైన అంశాలు మానేసి వ్యక్తిగత అజెండాతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎంతో గొప్పదని.. ఇలా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరమన్నారు శైలజానాథ్.

Background

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపట్లో అమరావతిలో జరగనుంది.  వెలగపూడి సచివాలయంలోని ఫస్ట్ ఫ్లోర్ కేబినెట్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది.  ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది.  వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించనుంది. ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  21 నుంచి ఐదురోజులపాటు ఈ సమావేశాలు జరుగతాయి.  ఐదు రోజులుపాటే జరుగుతాయా మరికొన్ని రోజులు పొడిగించాలా అనేదానిపై కూడా కేబినెట్‌లో చర్చిస్తారు.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.           


నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 21న ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి.  అయిదు రోజులపాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్‌ సర్కారు రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది. 


మార్పుల అనంతరం వెంటనే పూర్తి చేస్తే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ఏపీ సర్కారు ప్రవేశపెట్టనుంది. బిల్లులతో పాటు కీలకాంశాలపై ప్రస్తావన సభలో వచ్చే ఛాన్స్ ఉంది. సీఎం విశాఖకు తరలి వెళ్లే అంశంపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబుపై కేసులను ప్రస్తావించడానికి వైఎస్సార్సీఎల్పీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.                            


సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలతో అపాయింట్ మెంట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.  . ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా పార్లమెంట్ సమవేశాలతో  బిజీగా ఉన్నారు. దీంతో ఇంకా అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ... అపాయింట్ మెంట్లు దొరికితే వెళ్లి వచ్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.    


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు కొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


హైదరాబాద్‌లో వాతావరణం


హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.