= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి గుడివాడ అమర్నాథ్ తప్పుచేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటున్న చంద్రబాబు చేసిన అవినీతి మీద చర్చకు రమ్మనమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లోకేష్ పిలవడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఒక్క స్కిల్ డెవలప్ సెంటర్ పెట్టారని నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి గుడివాడ అన్నారు. శనివారం స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ.డీ., ఐ.టీ, సిఐడి అధికారులు విచారణకు రమ్మనమని లోకేష్ ను పిలుస్తుంటే, దాని గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చర్చకు పిలిచిన లోకేష్ తన స్థాయి ఏంటో, అతని బతికేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ పాత్ర బయట పెట్టడానికే దర్యాప్తు సంస్థలు ఆయనను పిలుస్తున్నాయని అమర్నాథ్ అన్నారు. 371 కోట్ల రూపాయలు పందికొక్కుల్లా తినేసి, బలిసి, అడ్డంగా దొరికిపోయి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బహిరంగ చర్చకు ఏ విధంగా పిలుస్తున్నారని అమర్నాథ్ ప్రశ్నించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేంద్ర మంత్రి అమిత్ షాతో పీవీ సింధు భేటీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. పీవీ సింధుతో భేటీ అనంతరం అమిత్ షా స్పందించారు. సింధు అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె అసాధారణమైన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో దేశం గర్వించేలా చేసిందన్నారు. ఆట పట్ల ఆమె నిబద్ధత, చేసిన కృషి, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ ట్వీట్ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తాజ్కృష్ణా హోటల్లో సీడబ్ల్యూసీ మీటింగ్ ప్రారంభం, హాజరైన కాంగ్రెస్ కీలక నేతలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు. రెండు రోజుల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్కృష్ణా హోటల్లో శనివారం ప్రారంభమైంది. అంతకుముందు సీడబ్లూసీ సమావేశ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేతలకు కళాకారులు తమ నృత్యాలతో స్వాగతం పలికారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరించిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైలాన్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. నార్లాపూర్ తొలి పంపు స్విచ్ చేసి ప్రారంభించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
CWC Meeting: హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు CWC meeting: హైదరాబాద్ కు చేరుకున్న కాంగ్రెస్ పెద్దలు..
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు హైదరాబాద్ వచ్చిన అగ్రనేతలకు టీ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్వాగతం పలికారు. ప్రియాంకా గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే బోకె ఇచ్చి స్వాగతం పలికారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కారు ర్యాలీ హైదరాబాద్ నానక్రామ్గూడలోని ORR జంక్షన్ నుంచి కారు ర్యాలీ తీశారు ఐటీ ఉద్యోగులు. ఎలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నప్పటికీ వాటిన్నింటినీ పట్టించుకోకుండా ఐటీ ఉద్యోగులు ఓఆర్ఆర్ ఎక్కారు. చంద్రబాబు అరెస్టును ఖండించిన టెకీలు... కేసీఆర్పై మండిపడ్డారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉంటే అక్కడ కూడా ఇలాంటి అభివృద్దీ జరిగేదన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పాలమూరు బయల్దేరిన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడానికి ప్రగతి భవన్ నుంచి పాలమూరుకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరిన సీఎం కేసీఆర్.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తెలంగాణ, తమిళనాడులో ఎన్ఐఏ సోదాలు
ISIS రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో తమిళనాడు, తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఏక కాలంలో 30 ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. కోయంబత్తూరులో 21, చెన్నైలో 3, హైదరాబాద్లో 5, తెన్కాశీలో 1 చోట తనిఖీలు చేస్తోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేసీఆర్ది మోసపూరిత రాజకీయం- 33% రిజర్వేషన్ డిమాండ్ లేఖపై బీజేపీ ఆగ్రహం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై తెలంగాణ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఫామ్హౌస్ ప్లానింగ్, ఫామ్హౌస్ రియాల్టీ అంటూ లెక్కలతో వివరించేప్రయత్నం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యుల్లో 33 శాతం మహిళలు ఉండాలని ఫామ్హౌస్ ప్లానింగ్లో ఉందని కానీ రియాల్టీలో అది చాలా దూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసింది.
వంద మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే అందులో మహిళా ఎమ్మెల్యేలు 5 శాతం మందేనని... అంటే ఇక్కడ ఐదు శాతమే ఉన్నారని బీజేపీ విమర్సించింది. బీఆర్ఎస్ ఎంపీలు 16 మంది ఉంటే అందులో ఒక్కరంటే ఒక్కరే మహిలా ఎంపీ ఉన్నారని అంటే ఇక్కడ 6.25 శాతమేనంటూ గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కలుపుకున్నా 33 శాతం కావడం లేదని వ్యంగ్యంగా స్పందించింది బీజేపీ. అందుకే కేసీఆర్ది మోసపూరిత రాజకీయం అంటూ విమర్శలు చేసింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పోస్టర్లు- కరప్ట్ వర్కింగ్ కమిటీ పేరుతో ప్రచారం హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు వంద మంది వరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు హజరవుతున్నారు. ఇందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు కూడా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ బేనర్లు కనిపిస్తుంటే... వారికి వ్యతిరేకంగా కూడా కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. కరప్ట్ వర్కింగ్ కమిటీ” అంటూ పోస్టర్లు వేశారు ప్రత్యర్థులు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుల ఫొటోలు, వారు చేసిన స్కాముల వివరాలతో పోస్టర్లువేశారు. హోర్డింగ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలు అందులో ఉంచారు. బివేర్ ఆఫ్ స్కామర్స్ (స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి) అంటూ టాగ్ లైన్ తో వెలసిన పోస్టర్లు.