= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు: సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇళ్లు ఉన్న వారికి గృహలక్ష్మీ కొనసాగిస్తూనే.. ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో వివరించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'సౌభాగ్య లక్ష్మీ' పథకం - పేద మహిళలకు రూ.3 వేలు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3 వేల గౌరవ భృతి ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలు: సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టారు. అర్హులైన మహిళలకు రూ.3 వేల భృతి అందిస్తామన్నారు. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే సబ్సిడీ సిలిండర్ అందిస్తామని వెల్లడించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు: సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ద్వారా రూ.16 వేలు అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని దశలవారీగా పెంచనున్నట్లు పేర్కొన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు: సీఎం కేసీఆర్ వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీన్ని కూడా దశల వారీగా చేయనున్నట్లు తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పెన్షన్ రూ.5 వేలకు పెంపు - దశలవారీగా పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటన ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దశలవారీగా పెన్షన్ పెంపు అమలు చేస్తామన్నారు. తొలుత రూ.3 వేలు ఇచ్చి క్రమంగా ఏడాదికోసారి పెన్షన్ పెంచనున్నట్లు చెప్పారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'అన్నపూర్ణ పథకం' - రేషన్ కార్డులున్న వారికి సన్నబియ్యం తెలంగాణ 'అన్నపూర్ణ పథకం' కింద తెల్ల రేషన్ కార్డులున్న వారందరికీ సన్న బియ్యం అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రేషన్ కార్డుదారులకు 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా' పేరిట బీమా పథకం: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి కుటుంబానికి 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా' పేరిట బీమా చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఐసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఇది రైతు బీమా తరహాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పథకంతో 93 లక్షల పైచిలుకు వారికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4 వేలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచే నాలుగైదు నెలల్లోనే దీన్ని అమలు చేస్తామన్నారు. రైతు బీమా తరహాలోనే రూ.5 లక్షల కేసీఆర్ బీమా అందిస్తామన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తాం: సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వారికి బడ్జెట్ పెంచినట్లు చెప్పారు. మైనార్టీ జూనియర్ కళాశాలలను డిగ్రీ కాలేజీలుగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, బీసీలకు అమలు చేస్తున్న పథకాలను సైతం కొనసాగిస్తామన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ - 90 శాతం హామీలు అమలు చేశాం తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఎన్నికల ప్రణాళిక రూపంలో 10 శాతం చెప్తే 90 శాతం హామీలు అమలు చేసినట్లు చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసినట్లు పేర్కొన్నారు. రైతు బంధును మేనిఫెస్టోలో చేర్చలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. స్వయంగా ఆయనే పల్లాకు బీఫామ్ అందజేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్కు అందించిన కేసీఆర్ రెండు రోజుల్లో అందరికీ బీఫామ్స్ అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. టిక్కెట్ రాని వారు తొందర పడొద్దని, అందరికీ అవకాశాలుంటాయని చెప్పారు. కాగా, ఐదుగురు అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే 5 చోట్ల అభ్యర్థులు పెండింగ్ లో ఉన్నారు. 51 మందికి బీఫామ్స్ అందించిన కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఐదుగురు అభ్యర్థులను మార్చే ఛాన్స్.? తెలంగాణ భవన్ లో 51 మంది అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్స్ అందజేశారు. అయితే, ఐదుగురు అభ్యర్థులను మార్చే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 114 నియోజకవర్గాల అభ్యర్థులకు ఆదివారం బీఫామ్ ఇస్తారని తొలుత ప్రకటించినా, 51 మందికి మాత్రమే బీఫామ్స్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీంతో మిగతా అభ్యర్థుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రజల్లో గెలిచినా సాంకేతికంగా దెబ్బ తీస్తారు: కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లో గెలిచినా సాంకేతికంగా దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతీ కార్యకర్తతోనూ నేతలు మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రచార వ్యూహంపై గులాబీ బాస్ దిశా నిర్దేశం చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం: సీఎం కేసీఆర్ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం. ఎవరూ తొందరపడొద్దని బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో ఆయన అభ్యర్థులతో సమావేశమయ్యారు. సాంకేతికగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, కోప తాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలని అన్నారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలని, అభ్యర్థులకు 2 రోజుల్లో భీపామ్స్ అందిస్తామని తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కాంగ్రెస్ తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ కాంగ్రెస్ తొలి జాబితా విడుదల -55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్
బెల్లంపల్లి - గడ్డం వినోద్
మంచిర్యాల- ప్రేమ్సాగర్