Live News Updates: శ్రీశైలం చేరుకున్న అమిత్ షా.. ఘన స్వాగతం

ABP Desam Last Updated: 12 Aug 2021 12:41 PM

Background

హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురై దారుణ హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయభాస్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాబా లోక్‌నాథ్ అలియాస్ గురూజీని పోలీసులు అరెస్టు చేశారు. కొద్ది రోజులుగా...More

కీలక మావోయిస్టులు అరెస్టు

ఏపీ-ఒడిశా సరిహద్దులో కీలక మావోయిస్టులు ఆరుగురు అరెస్టయినట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో డివిజనల్ కమాండర్ సహా మరికొంత మంది నేతలు ఉన్నట్లు వెల్లడించారు. మావోయిస్టులకు గిరిజనుల్లో ఆదరణ కరవైందని డీజీపీ అన్నారు. వీరిలో గాదర్ల రవి అనే వ్యక్తి తమ ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ ఈ వివరాలు వెల్లడించారు.