Breaking News Telugu Live Updates: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 18 Jun 2022 08:03 PM

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు దాదాపుగా అన్ని జిల్లాల్లోకి ప్రవేశించాయి. దీంతో ఇకనుంచి అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాకతో...More

పట్టపగలే అత్యంత దారుణంగా స్నేహితుడి తండ్రిని హత్య చేసిన యువకుడు

చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలం, పెద్దకంపల్లిలో ఓ యువకుడు పట్ట పగలే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు.. అదే గ్రామానికి చేందిన శ్రీనివాసులు రావు తన ఇద్దరూ కుమారులతో కలిసి నివాసం ఉండేవాడు.. అయితే గత కొద్ది రోజులుగా తండ్రి‌ మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చుట్టు పక్కల గ్రామాల్లో అప్పులు చేసి జల్సాలు చేసేవారు.. ఇదే విషయంపై గత రెండు ఏళ్ళుగా తండ్రి, కుమారులకు తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి.. ఎప్పటికైనా తమ కుమారుల్లో మార్పు రాకుండా పోతుందా అనే ఆశతో శ్రీనివాసురావు తన కుమారులు చేసిన అప్పులు తీర్చేవాడు.. అయితే గ్రామంలో ఉంటున్న గిరిబాబు నాయుడు అనే యువకుడితో శ్రీనివాసురావు ఇద్దరు కుమారులు స్నేహంగా మెలుగుతున్నట్లు శ్రీనివాసురావు తెలుసుకున్నాడు.. వీరిపై శ్రీనివాసురావు ఆరా తీసేవాడు.. ముగ్గురు రోజు పీకల వరకూ తాగి, పేకాట ఆడుతూ కాలం గడిపేవారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి గాయ పరిచేవారు.. దీంతో గ్రామంలో ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.. రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తన కుమారులను తలుచుకుని శ్రీనివాసురావు కుమిలి పోయేవాడు.. అనేక మార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ముగ్గరిని హెచ్చరించినా వారు తీరు మార్చుకోకుండా పుల్ గా మద్యం సేవించి గ్రామస్తుల గొడవకు ఈడ్చేవారు.. అయితే తన కుమారులు చెడి పోయేందుకు కారణంమైన గిరిబాబు నాయుడిని పిలిచి‌న శ్రీనివాసులు తన కుమారులతో చేరొద్దని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని పలుమార్లు హెచ్చరించాడు.. ఇవేవి పట్టించుకోని గిరిబాబు నాయుడు రోజులాగే మద్యం సేవించి శ్రీనివాసురావు కుమారులతో పేకాట ఆడేవాడు.. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసు రావు ఈ రోజు మధ్యాహ్నం తన కుమారులతో చేరద్దని గిరిబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు.. గిరిబాబు నాయుడు, శ్రీనివాసురావులు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుని, వాగ్వాదంకు దిగ్గారు.. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గిరిబాబు నాయుడు తన నివాసంలో ఉన్న కత్తిని తీసుకుని ఒక్కసారిగా శ్రీనివాసులరావుపై దాడి చేసి గ్రామస్తులు అందరూ చూస్తుండం గానే అతికిరాతకంగా నరికి చంపాడు.